ఖానాపురం, డిసెంబర్ 5 : విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు భోజనం అందించాలని ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు సూచించారు. ఈ మేరకు సోమవారం మండలంలోని ఐనపల్లిలోని మహత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలను ఎంపీపీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ పాఠశాలకు సంబంధించిన రికార్డులను, అదేవిధంగా వంటగదిని, తరగతి గదులను పరిశీలించారు. ప్రభుత్వం బాలికల విద్యకు పెద్దపీట వేస్తున్నదన్నారు. ఓక్కో విద్యార్థికి లక్ష రుపాయలకు పైగా ఖర్చు చేస్తున్నదన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాస ప్రవీణ్కుమార్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మండల అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకటనర్సయ్య, దాసరి రమేశ్ పాల్గొన్నారు.