వరంగల్ ఏసీపీ గిరికుమార్
కరీమాబాద్, డిసెంబర్ 5 : విద్యార్థులు సోదరభావంతో మెలగాలని ఏసీపీ గిరికుమార్ అన్నారు. ఫార్మసీ కోర్సుల్లో నూతన ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఉర్సు బైపాస్ రోడ్డులోని తాళ్ల పద్మావతి కళాశాలలో చైర్మన్ తాళ్ల మల్లేశం ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. ఉన్నత లక్ష్యంతో చదవాలన్నారు.
అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆపద సమయాల్లో 100కు ఫోన్ చేయాలన్నారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తెలియని లింక్లను క్లిక్ చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ ఫార్మసీ కళాశాల డీన్ ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, జనగామ డ్రగ్ ఇన్స్పెక్టర్ రవి, ఆరోగ్య ఫార్మసీ మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్కుమార్, మైండ్ ప్లస్ ఫౌండర్ మహ్మద్ జానీ, డైరెక్టర్ తాళ్ల వరుణ్, కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్రావు, ప్రొఫెసర్లు బేతి శ్రీనివాస్, సత్యనారాయణ పట్నాయక్, కల్పనా స్వెయిన్, నాగిరెడ్డి, ఏవో మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.