నర్సంపేట రూరల్, డిసెంబర్ 5 : మండలంలోని లక్నెపల్లి గ్రామ శివారు బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాలకు చెందిన కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి మంద శ్రీధర్కు కల్పఆచార్య అవార్డు వచ్చినట్లు బా లాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ అండృ రాజేంద్రప్రసాద్రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. డాక్టర్ మంద శ్రీధర్ విద్యాబోధనలో 13 ఏండ్ల అనుభవం కలిగి ఉన్నారని, 15కు పైగా ఇంటర్నేషనల్ పేపర్స్తో పాటు 4 పుస్తకాలు, అనేక పరిశోధన రంగమైన ఐఓటీలో శ్రీధర్ చేసిన విశేష కృషికి గాను ఈకల్ప ఆచార్య అవార్డు వచ్చినట్లు తె లిపారు. అనంతరం అవార్డు గ్రహితను ప లువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రి న్సిపాల్ డాక్టర్ వీఎస్ హరిహరన్, సెక్రటరీ డాక్టర్ రాజేశ్వర్రెడ్డి, ఏవో సలేంద్ర సురేశ్, డీన్ ఆఫ్ అకాడమిక్స్ డాక్టర్ నారాయణ, ఫర్వేజ్, విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.