కమలాపూర్, నవంబర్ 30: మెరుగైన రవాణా సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం పనులు చేస్తుంటే కేంద్రంలోని బీజేపీ సర్కారు మాత్రం కాలయాపనతో ప్రజలను ఇబ్బందులు పెడుతున్నది. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు చేపట్టి నాలుగేళ్లయినా అసంపూర్తిగానే మిగిలాయి. ఇది పరకాల-హుజూరాబాద్ ప్రధాన రహదారి కావడంతో అప్పటి కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ తెలంగాణలోనే తొలిసారిగా నాలుగు లేన్ల ఆర్వోబీ కోసం రూ.66కోట్లు కేటాయించారు. రాష్ట్ర సర్కారు వాటా 60శాతం కాగా కేంద్ర ప్రభుత్వం వాటా 40శాతం ఖర్చు చేయాల్సి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ 2018లో పనులు మొదలుపెట్టి ఏడాది క్రితం పూర్తి చేసినా రైల్వే లైన్లపై రీడిజైన్ పేరిట పనుల్లో కేంద్రం జాప్యం చేస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడాల్సి వస్తున్నది.
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. బ్రిడ్జి పనులు ప్రారంభమై నాలుగేళ్లు కావస్తున్న ఇంకా పూర్తికాకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పరకాల-హుజూరాబాద్ ప్రధాన రహదారిపై ఉప్పల్లో రైల్వే లైన్ ఉంది. ఇక్కడ రాష్ట్రంలోనే తొలిసారి నాలుగులేన్ల ఆర్వోబీ కోసం అప్పటి ఎంపీ వినోద్కుమార్ రూ.66కోట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన టెండర్ను దక్కించుకున్న కాంట్రాక్టర్ 2018లో పనులు మొదలుపెట్టి ఏడాది క్రితమే పూర్తి చేశాడు. రైల్వే లైన్కు ఇరువైపులా బ్రిడ్జి పనులు పూర్తయినా లైన్పై నిర్మాణం పూర్తికాక రాకపోకలకు తిప్పలు తప్పడం లేదు.
రీడిజైన్ పేర నిర్లక్ష్యం
రైల్వే ఓవర్ బ్రిడ్జిని రీడిజైన్ పేరుతో కేంద్రం నిర్లక్ష్యం చేస్తున్నది. రైల్వేలైన్కు ఇరువైపులా నాలుగులేన్ల బ్రిడ్జి పనులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. దేశ రాజధాని ఢిల్లీకి ఇక్కడి నుంచి ప్రధాన రైలుమార్గం కావడంతో కాజీపేట నుంచి బల్లార్ష వరకు మూడో రైల్వే లైన్ పనులు పూర్తయ్యాయి. ఇటీవల ఉప్పల్ నుంచి మూడో రైల్వే లైన్ ద్వారా రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. మూడు రైల్వే లైన్లపై రైళ్ల రద్దీ పెరిగింది. రైళ్ల స్పీడు పెంచడంతో ఉప్పల్ రైల్వేగేట్ పడితే గంట సమ యం పడుతున్నది. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కరీంనగర్, హనుమకొండ, భూపాలపల్లి, ములుగు జిల్లాలను కలిపే పరకాల-హుజూరాబాద్ ప్రధాన రహదారి కావడంతో ఇక్కడ వా హనాల రద్దీ ఎక్కువ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రైల్వే లైన్కు ఇరువైపులా బ్రిడ్జి పనులు పూర్తి చేయడం, రైల్వే గేటుపై నిలిచిపోవడంతో ఇది తెలియని వాహనదారులు రాత్రి వేళలో బ్రిడ్జిపైకి వెళ్లుతున్నారని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కాంట్రాక్టర్ ఇరువైపులా అడ్డుగోడ నిర్మించాడు.
పట్టించుకోని కరీంనగర్ ఎంపీ
కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆర్వోబీ పనులు నిలిచిపోయినా తన పార్లమెంట్ పరిధిలోనే ఉన్న దీనిని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఏనాడు పట్టించుకోవ డం లేదు. పాదయాత్ర పేరుతో పబ్బం గుడుపుతున్న బండి సంజయ్కి, తన ని యోజకవర్గ పరిధిలో ఆర్వోబీ పనులు అసంపూర్తిగా ఉన్న విషయం తెలియదా అని వాహనదారు లు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న రైల్వే లైన్లపై పనులు పూర్తి చేయించడంపై ఎంపీ బండి సంజయ్ ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీస్తున్నారు. రైల్వేమంత్రితో మాట్లాడి పనులు పూర్తి చేయించాల్సినా బాధ్యతన ఆయనపై లేదా అని విమర్శిస్తున్నారు.