ఖిలావరంగల్, నవంబర్ 26: భారత ఎన్నికల సంఘం ఓటరు నమోదు నిబంధనలు-2022 ద్వారా ఫారాల్లో మార్పులు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బీ గోపి ఒక ప్రకటనలో తెలిపారు. ఫారం 001, ఫారం 8ఏకు సంబంధించి ఒకే నియోజకవర్గంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రదేశానికి మారిన ఓటర్ల జాబితాను మార్చే దరఖాస్తులను రద్దు చేసినట్లు తెలిపారు. ఓటరు జాబితాలో చేరిన ఒకే వ్యక్తి ఒకే నియోజకవర్గంలో ఒక్కటి కంటే ఎక్కవ సార్లు నమోదైన లేదా పలు నియోజకవర్గాల్లో ఓటరుగా నమోదైన వారిని గుర్తించేందుకు ఓటర్లు స్వచ్ఛందంగా ఆధార్ నంబర్తో అనుసంధానం చేసుకోవాలని కోరారు.
ఆధార్తో అనుసంధానం ఇలా..
ఫారం 6బీ ఆన్లైన్లోని ఎరోనెట్, గరుడ, ఎన్వీఎస్పీ, వీహెచ్ పోర్టల్ లేదా యాప్ల ద్వారా ఆధార్ సేకరణ పద్ధతి అందుబాటులో ఉందని కలెక్టర్ అన్నారు. స్వీయ ధ్రువీకరణ ఓటరు ఎలక్టోరల్ పోర్టల్ లేదా యాప్ల్లో ఆన్లైన్లో ఫారం 6బీని పూరించాలని తెలిపారు. ఆధార్ లింక్తో ఉన్న మొబైల్ నంబర్కు ఓటీపీని ఉపయోగించి ఆధార్ను అనుసంధానం చేసుకోవచ్చని వివరించారు. ఆధార్ లేకుంటే 6బీ ఫారంలో పేర్కొన్న 11 ప్రత్యామ్నాయ పత్రాల్లో ఏదైన ఒక కాపీ జిరాక్స్ ప్రతిని సమర్పించాలని తెలిపారు. ఆధార్ ఇవ్వలేదని ఓటర్ల జాబితా నుంచి పేరును తొలగించరని తెలిపారు. ఫారం 7 ద్వారా అభ్యంతరం ఉన్న ఓటర్ల జాబితాలో పేరును తొలగించవచ్చని తెలిపారు. జిల్లాలోని నర్సంపేట, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాల ప్రజలు ఇంటికి వచ్చిన బీఎల్వోలకు ఆధార్ లేదా ఇతర డాక్యుమెంట్లు ఇచ్చి ఓటరు నమోదు అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
డబుల్ బెడ్రూం ఇళ్ల పరిశీలన
ఖిలావరంగల్: మండలంలోని తిమ్మాపూర్, దూపకుంటలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను శనివారం కలెక్టర్ బీ గోపి పరిశీలించారు. 2013 జనవరి 15లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని, అదేవిధంగా పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇండ్ల ప్రక్రియను వెంటనే చేపట్టాలని ఇటీవల రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీంతో నిర్మాణం పూర్తి కావొస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లను కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో కలిసిన పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.