నర్సంపేట/ఖానాపురం/దుగ్గొండి/రాయపర్తి, నవంబర్ 26: రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నర్సంపేట ఆర్టీసీ డిపోలో డీఎం విజయమాధురి ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నర్సంపేటలోని సిద్ధార్ధ డిగ్రీ, పీజీ కళాశాలలో రాజ్యాంగ దినోత్సవంపై సదస్సు నిర్వహించారు. ప్రిన్సిపాల్ గోగుల ప్రభాకర్రెడ్డి పాల్గొని విద్యార్థులకు భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించారు. నర్సంపేట అంబేద్కర్ సెంటర్లో ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి బొట్ల నరేశ్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ప్రజ్ఞ కళాశాలలో సమావేశం నిర్వహించారు. జన్ను సాంబయ్య పాల్గొని అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఖానాపురంలోని మండల పరిషత్ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మనదేశానిదేనన్నారు. ఎంపీడీవో సుమనావాణి తదితరులు పాల్గొన్నారు. దుగ్గొండి మండలం గిర్నిబావిలోని ఎంజేపీటీలో ప్రత్యేకాధికారి కూరోజు దేవేందర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన చరిత్రను విద్యార్థులకు వివరించారు. రాయపర్తిలోని రాజీవ్చౌరస్తాలో ఉన్న అంబేద్కర్, బాబూ జగ్జీవన్రాం విగ్రహాలకు ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేశారు. అనంతరం పలు పోటీల్లో విజేతలకు భారత రాజ్యాంగ గ్రంథాలను బహుమతిగా అందించారు. కార్యక్రమంలో డీటీ ధరావత్ సూర్యానాయక్, పలు సంఘాల ప్రతినిధులు మల్లేశ్, యాకయ్య, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు రెంటాల గోవర్ధన్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు అయిత రాంచందర్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం..
నల్లబెల్లి/కరీమాబాద్/చెన్నారావుపేట/గీసుగొండ/సంగెం/పోచమ్మమైదాన్(కాశీబుగ్గ): అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తహసీల్దార్ దూలం మంజుల పిలుపునిచ్చారు. నల్లబెల్లి జీపీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని దేశంలో ఆమోదించి నేటికి 73 ఏళ్లు పూర్తయిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్కుమార్, సర్పంచ్ నానెబోయిన రాజారాం, ఆర్ఐ రాజేంద్రప్రసాద్, కార్యదర్శి ధర్మేందర్, ఎంపీటీసీ జన్ను జయరావు, ఉపాధ్యాయులు ఉడుత రాజేందర్, టీఆర్ఎస్ నాయకులు సట్ల శ్రీనివాస్గౌడ్, తెలంగాణ ఉద్యమకారుడు బట్టు సాంబయ్య, పరికి కోర్నేల్ పాల్గొన్నారు.
కరీమాబాద్ అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బొమ్మల్ల అంబేద్కర్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. వరంగల్ కరీమాబాద్లోని డాక్టర్ అంబేద్కర్, బుద్ద భగవాన్, బొమ్మల్ల కట్టయ్య విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎరుకల మహేందర్, తరాల రాజమణి, జక్కుల రాజు పాల్గొన్నారు. అండర్రైల్వేగేట్ ప్రాంతంలోని పలు విద్యాలయాల్లో అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి ప్రభుత్వ పాఠశాలలో భారత రాజ్యాంగ ప్రతి, ప్రవేశిక, రాజ్యాంగ నిర్మాతల ఫొటోలకు ఉపాధ్యాయులు పూలమాలలు వేశారు. అనంతరం విద్యార్థులకు రాజ్యాంగ మూల సూత్రాలు, ప్రవేశిక, ఆదేశ సూత్రాలు, ప్రాథమిక హక్కులు, వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి తీసుకున్న అంశాలను చిత్రరూపంలో ప్రదర్శించారు. సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు ఉదయ్కుమార్, రవికుమార్ సారథ్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం ఫ్లోరెన్స్ మాట్లాడుతూ ప్రతి పౌరుడూ రాజ్యాంగం గురించి తెలుసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమణారావు, ఉమారాణి, శ్రీనివాస్, సంతోష్కుమార్, బాలాజీ, ఉదయ్కుమార్, మాధవి, మమత, రవికుమార్, మాధవి, సుందర్, మురళి, రవీందర్ పాల్గొన్నారు.
గీసుగొండ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రమేశ్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. మండలకేంద్రంతోపాటు మరియపురం, గొర్రెకుంటలో అంబేద్కర్ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేశారు. మరియపురం, గీసుగొండ సర్పంచ్లు అల్లం బాలిరెడ్డి, దౌడు బాబు రాజ్యాంగం గురించి వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ భీమగాని సౌజన్య, ఎంపీవో ప్రభాకర్, వివిధ సంఘాల నాయకులు రాజ్కుమార్, లవ్రాజ్, నర్సయ్య, ఆనందం, కిరణ్, రాజు, నర్సింహస్వామి, సత్యం, రవి, దాసు, రాజు, అఖిల్ పాల్గొన్నారు. సంగెంలో అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కొమురయ్య, సర్పంచ్ గుండేటి బాబు, ఎంపీటీసీ మల్లయ్య, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, కోడూరి సదయ్య, మునుకుంట్ల మోహన్, పులి వీరస్వామి, మొగిలి, బొజ్జ సురేశ్, మాజీ సర్పంచ్ మాదినేని రాంరెడ్డి పాల్గొన్నారు. కాశీబుగ్గ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా నాయకుడు ఆయూబ్ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న పార్లమెంటరీ కమిటీలో బాబు రాజేంద్రప్రసాద్ ప్రవేశపెట్టగా ఆమోద ముద్ర వేశారని వివరించారు. ఢిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గజ్జెల లింగమూర్తి, బాషపాక సదానందం, జన్ను రవి, గొల్లన రవి, జన్ను భాస్కర్, అదాం, గిన్నారం రాజు, సందెల లాజరస్, కిషన్, కిన్నర రవి పాల్గొన్నారు.