రాయపర్తి, నవంబర్ 16: మండల అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో గుగులోత్ కిషన్నాయక్ అధ్యక్షతన మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారం, మంత్రి ఎర్రబెల్లి తోడ్పాటుతో మండలంలోని 39 గ్రామాల్లో కోట్లాది రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులు, ప్రజాప్రతినిధులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సర్పంచ్లు, ఎంపీటీసీలు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు.
పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీ రంగు కుమార్, తాసిల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీవో తుల రామ్మోహన్, మండల పశు వైద్యాధికారులు వీరగోని శ్రుతి, సోమశేఖర్, ఏవో గుమ్మడి వీరభద్రం, ఏపీఎం పులుసు అశోక్కుమార్, ఏపీవో దొనికెల కుమార్గౌడ్, నోముల రంగయ్య, విల్సన్, ఐలయ్య, వెంకన్న, ఏఈలు బాలదాసు, తరుణ్, ముజాఫర్, అనూష, కార్తీక్రెడ్డి, కామిశెట్టి మురళీకృష్ణ, చిలుక ప్రవీణ్, తూర్పాటి స్వప్న, సత్యవతి, విజయలక్ష్మి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.