నయీంనగర్, నవంబర్ 13 : తెలుగు సాహితీ ప్రపంచంలో రామలక్ష్మణుల లాంటి కాళోజీ సోదరులు జీవించినంత కాలం రాజ్యం నిరంకుశ పోకడలను నిరసించి, ప్రజల పక్షం వహించి సమాజ శ్రేయస్సు కోరారని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ కే రామచంద్రమూర్తి అన్నారు. ఆదివారం హనుమకొండలోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాల సెమినార్హాల్లో కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షుడు నాగిళ్ల రామశాస్త్రి అధ్యక్షతన కాళోజీ సోదరుల యాది సభ నిర్వహించారు. ముందుగా కాళోజీ సోదరుల చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా రామచంద్రమూర్తి హాజరై మాట్లాడారు. అణచివేతకు గురైన పీడిత ప్రజల పక్షాన నిస్వార్థంగా పని చేయడమే కాకుండా, నిద్రాణమైన తెలంగాణ సమాజాన్ని తమ కవిత్వంతో కాళోజీ సోదరులు మేలొలిపారని పేరొన్నారు. అనంతరం ప్రముఖ కవి ఎలనాగ అనువాదం చేసిన మై లామెంట్ కాళోజీ కవితల ఇంగ్లిష్ కావ్యాన్ని ఆయన ఆవిషరించారు. కావ్యాన్ని ప్రముఖ నవలా రచయిత కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ పరిచయం చేశారు.
అనంతరం కాళోజీ ఫౌండేషన్ కార్యదర్శి వీఆర్ విద్యార్థి మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా కాళోజీ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలపై నివేదిక సమర్పించారు. ఫౌండేషన్ సంయుక్త కార్యదర్శి పొట్లపల్లి శ్రీనివాస్రావు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ కే రామచంద్రమూర్తికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్మారక పురసారం, ప్రముఖ ఉర్దూ కవి డాక్టర్ కుత్భ సర్షార్కు కాళోజీ రామేశ్వర్రావు స్మారక పురసారం అందజేసి సన్మానించారు. ఈ సందర్భంగా కాళోజీ సోదరుల స్మారక పురసారాలు అందుకోవడం సంతోషంగా ఉందని పురసార గ్రహీతలు పేరొన్నారు. కాగా, ఫౌండేషన్ నిర్వహణ కార్యదర్శి డాక్టర్ ఆగపాటి రాజ్కుమార్ వందన సమర్పణ చేశారు. కార్యక్రమంలో ఎన్వీఎన్ చారి, సిరాజుద్దీన్, నెల్లుట్ల రమాదేవి, గంట రామిరెడ్డి, వల్లంపట్ల నాగేశ్వర్రావు, పాతూరి రఘురామయ్య, డాక్టర్ మంథని శంకర్ తదితరులు పాల్గొన్నారు.