సుబేదారి, అక్టోబర్ 27 : పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్జోషి అన్నారు. పోలీస్ ఫ్లాగ్ డేను పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం వద్ద సీపీ జెండా ఊపి గురువారం సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. హనుమకొండ చౌరస్తా, ములుగురోడ్డు, ఎంజీఎం, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆడిటోరియం వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. రైడర్స్తో కలిసి సీపీ ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసు అమరువీరుల కుటుంబాలకు ప్రజలు అండగా ఉండాలని కోరారు. పోలీసులు తమ కుటుంబ క్షేమం కంటే, సమాజ క్షేమం కోసం శ్రమిస్తారని అన్నారు. ర్యాలీకి వ్యాపారులు, విద్యార్థులు, ఎంజీఎం సిబ్బంది పూలతో స్వాగతం పలికారు. కార్యకమ్రంలో సెంట్రల్ జోన్ డీసీపీ అశోక్కుమార్, అదనపు డీసీపీ పుష్పారెడ్డి, వైభవ్ గైక్వాడ్, సురేశ్కుమార్, సంజీవ్, ఏసీపీలు, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.