ఖిలావరంగల్, అక్టోబర్ 7: అటవీ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేసి పోడు భూ ములపై విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ బీ గోపి ఆదేశించారు. శుక్రవారం వరంగల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోడు భూముల సమస్యను పరిష్కరించేందుకు ఫారెస్టు, రెవెన్యూ, పంచాయతీ కార్యదర్శులతో సదస్సు నిర్వహించా రు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పోడు భూములపై 7711 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిని పరిష్కరించేందుకు ఆర్ఓఎఫ్ఆర్ చట్టం కింద ప్రభుత్వం ప్రత్యేక యాప్ను రూపొందిం చిందన్నారు. ఈ యాప్ను ఎలా ఉపయోగించా లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పంచా యతీ కార్యదర్శులకు అవగాహన కల్పించామన్నా రు.
15 మందితో కూడిన ఎఫ్ఆర్సీ కమిటీ సభ్యు లను ఏర్పాటు చేశామని, వీరు ప్రత్యేక యాప్ గు రించి పూర్తి వివరాలతోపాటు హ్యాబిటేషన్ వారీగా వివరాలు ఇవ్వాలన్నారు. రెండు రోజుల్లో యాక్షన్ ప్లాన్ తయారు చేసి సర్వే చేయాలని ఆదేశించారు. మండల లెవల్ కమిటీలను ఏర్పాటు చేసి ఫీల్డ్ మీ దికి వెళ్లాలని, ఈ క్రమంలో పోలీసు శాఖ సహా యం తీసుకోవాలన్నారు. 20 రోజుల్లో పోడు భూముల కు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయాల న్నారు. ఏదైనా తప్పిదం జరిగినట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్ర మంలో అదనపు కలెక్టర్లు కే శ్రీవత్స, బీ హరిసిం గ్, ఆర్డీఓ మహేందర్జీ, డీఆర్డీఓ సంపత్రావు, సీపీఓ జీవరత్నం, డీటీడీఓ ఎస్కే జహీరుద్దీన్, అ టవీ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీపీ లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.