ఐనవోలు, అక్టోబర్ 5: దసరా ఉత్సవాలు బుధవారం ఊరూరా వైభవంగా జరిగాయి. ఉదయాన్నే కొత్త దుస్తులు ధరించి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ సభ్యులు, బంధు, మిత్రులకు జమ్మిఆకు పంచుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఐనవోలు మండల కేంద్రంలో కాటబోయిన వంశీయుల్లో ఉప్పలయ్య, సర్పంచ్ కుమారస్వామి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు దసరా వేడుకలు నిర్వహించారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో దసరా వేడుకలు జరిగాయి. ఐనవోలు పోలీస్ స్టేషన్లో ఎస్సై జీ వెంకన్న, ఎస్బీ ఎస్సై చక్రధర్, పోలీసులతో కలిసి ఆయుధపూజ చేశారు.
పరకాల: దసరా ఉత్సవాలు పట్టణంతోపాటు మండలంలోని గ్రామాల్లో ఘనంగా జరిగాయి. పట్టణంలోని బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజల్లో మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చెన్నకేశవస్వామి ఆలయం వద్ద రథోత్సవాన్ని ప్రారంభించారు. పట్టణంలోని పశువుల సంతలో రావణసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ వైస్ రేగూరి విజయపాల్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ తిరునహరి శేషాంజన్ స్వామి, ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
నడికూడ: మండల కేంద్రంలో సర్పంచ్ ఊర రవీందర్రావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. దసరా వేడుకలను డప్పు చప్పుళ్లతో బుధవారం ఉదయం ప్రారంభించారు. దుర్గమ్మ ఆశీస్సులు గ్రామస్తులందరికీ ఉండాలని ఆయన కాంక్షించారు. పార్టీ మండల అధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి, ఎంపీటీసీ అప్పం పార్టీ గ్రామ అధ్యక్షుడు నారగాని శ్రీను, కార్యదర్శి రావుల కిషన్, పాక్స్ డైరెక్టర్ ఊర సతీశ్రావు పాల్గొన్నారు.
కమలాపూర్: పోలీస్ స్టేషన్లో బుధవారం పోలీస్ సంజీవ్ ఆయుధపూజ నిర్వహించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో దసరా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. జమ్మిచెట్టు వద్ద ప్రదక్షిణలు చేశారు. ఆలయాల్లో భక్తులు ఉదయం నుంచి పూజలు చేశారు. దుర్గామాత నవరాత్రోత్సవాల్లో భాగంగా మండపాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎస్సై చరణ్, ఏఎస్సైలు సమ్మిరెడ్డి, ప్రవీణ్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై ప్రసాద్, సుమన్ ఆయుధ పూజ చేశారు. అనంతరం సిబ్బందికి జమ్మి ఆకు అందజేసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబళ్లు, కానిస్టేబుళ్లు, సిబ్బంది పాల్గొన్నారు.
న్యూశాయంపేట: గ్రేటర్ 31వ డివిజన్ న్యూశాయంపేటలో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆచారం ప్రకారం జెండాను ఎగరవేసి, జమ్మి ఆకును వాడవాడలా పంపిణీ చేశారు. మామిండ్ల రాజు, మాజీ కార్పొరేటర్ మోహన్రావు, వేణుగోపాల్, కోడెం సంపత్, ఎనబోతుల సతీశ్, ఆరెళ్లి అభిలాశ్ పాల్గొన్నారు.
శాయంపేట: మండల వ్యాప్తంగా దసరా వేడుకలు వైభవంగా జరిగాయి. గ్రామాల్లో పూజలు చేసి, ఆనిగపు కాయను కొట్టారు. జమ్మి చెట్టును ప్రతిష్ఠించి పూజల తర్వాత ఆకుల కోసం పోటీపడ్డారు. శాయంపేట పోలీస్స్టేషన్లో ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు ఆయుధ పూజ చేశారు. శాయంపేట గాంధీచౌక్ వద్ద ప్రతిమను దహనం చేశారు. ప్రజలు ఊరి శివారుకు వెళ్లి పాలపిట్టను దర్శించుకున్నారు.
దామెర: మండలంలోని ల్యాదెళ్ల గ్రామంలో ఎంపీపీ కాగితాల శంకర్ దసరా ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కోగిల్వాయిలోని చెన్నకేశవస్వామి ఆలయంలో దసరా వేడుకల్లో సర్పంచ్ విష్ణువర్థన్రెడ్డి, ఎంపీటీసీలు సంగబోయిన మౌనికా కిరణ్, మండల కో ఆప్షన్ సభ్యులు అక్తర్, పీఏసీఎస్ డైరెక్టర్ గుండా చంద్రమోహన్, ఉపసర్పంచ్ సాంబయ్య పూజల్లో పాల్గొన్నారు. ఊరుగొండ, సీతారాంపురం, దుర్గంపేట, పులుకుర్తి, వెంకటాపురం, దామెర గ్రామాల్లో భక్తిశ్రద్ధల నడుమ దసరా పండుగ నిర్వహించారు. దసరా వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్సై హరిప్రియ బందోబస్తు నిర్వహించారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: విజయదశమి వేడుకలు బుధవారం మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గ్రామాల్లోని ప్రత్యేక స్థలాల్లో నిర్వహించారు. పంచాయతీల ఆధ్వర్యంలో జమ్మిచెట్టుకు సర్పంచ్లు ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు ఆలయాల వద్ద వాహన పూజలు చేశారు. ఏసీపీ శివరామయ్య, ఎస్సైలు ప్రసాద్, సుమన్, ఎంపీపీ మార్క సుమలత, జడ్పీటీసీ కక్కెర్ల రాధికా రాజు, వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్రెడ్డి, సర్పంచ్లు వంగాల స్వాతీ భగవాన్రెడ్డి, ఎనకతళ్ల విజయహంసాల్రెడ్డి, సావురే కమలా రాజేశ్వర్రావు, కొరే లలితా రమేశ్, మచ్చిక యాదగిరి, రంపీస మనోహర్, ఎంపీటీసీలు బయ్య రమా రాజు, అర్షం వరుణ్గాంధీ, బీరం రజనీకర్రెడ్డి, బొమ్మగాని భాగ్యా రవి, మందపల్లి మమతా రవీందర్ పాల్గొన్నారు.
ధర్మసాగర్: మండలంలోని పలు గ్రామాల్లో దసరా పండుగను ఘనంగా జరుపుకున్నారు. జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. చెడుపై విజయానికి ప్రతీకగా ఈ పండుగను నిర్వహిస్తున్నట్లు వివరించారు. మండల కేంద్రంలో అర్చకులు కొడకండ్ల రంగాచార్యులు, భాను పూజలు నిర్వహించారు. రమేశ్, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.