సుబేదారి, అక్టోబర్ 5: జాతీయ పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావంపై 51వ డివిజన్ కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్రావు ఆధ్వర్యంలో హనుమకొండ అదాలత్ అమరవీరుల జంక్షన్ వద్ద స్వీట్లు పంపిణీ చేసుకొని సంబురాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నవ భారత నిర్మాణం కోసం జాతీయ పార్టీని స్థాపించారని తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు గంగాధర రాజు, శ్రీఖర్, సందీప్, రాజేశ్ పాల్గొన్నారు.
హసన్పర్తి: గ్రేటర్ 66వ హసన్పర్తి జాతీయ రహదారిపై టీఆర్ఎస్ పార్టీ మండల బండి రజినీకుమార్ ఆధ్వర్యంలో బుధవారం కేసీఆర్కు చేశారు. అనంతరం పటాకులు కాల్చి స్వీట్లు పంచారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజల అభ్యున్నతిని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారని తెలిపారు. కేసీఆర్తో దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చకిలం రాజేశ్వర్రావు, వీసం సురేందర్రెడ్డి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పిట్టల కుమారస్వామి, రేణుకుంట్ల ప్రసాద్, బోడ యుగేందర్, పెద్దమ్మ శ్రీనివాస్, జట్టి రాజేందర్, నద్దునూరి నాగరాజు, గరిగే మురళి, గుండమీది మురళి, చంటి, ప్రభాకర్ పాల్గొన్నారు.
పరకాల: పట్టణంలోని బస్టాండ్ సెంటర్లో బీ(టీ)ఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మడికొండ శ్రీను, మున్సిపల్ చైర్పర్సన్ సోదా అనితా రామకృష్ణ మాట్లాడారు. బీఆర్ఎస్తో దేశంలోని అన్నివర్గాలకు మేలు జరుగుతుందన్నారు. కేంద్రంలోని బీజేపీ అసమర్థ నిర్ణయాలతో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్నారు. అందుకే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించారని తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ బండి సారంగపాణి, కౌన్సిలర్లు దామెర మొగిలి, ఏకు రాజు, టీఆర్ఎస్ నాయకులు పసుల రమేశ్, మార్క టీఆర్ఎస్ పట్టణ మహిళా అధ్యక్షురాలు గంట కళావతి పాల్గొన్నారు.
దామెర: ల్యాదెళ్లలో ఎంపీపీ కాగితాల శంకర్ ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. గ్రామంలో ర్యాలీ తీస్తూ ‘జై బీఆర్ఎస్.. జై కేసీఆర్’ అంటూ చేశారు. దామెర మండల కేంద్రంలో జడ్పీటీసీ గరిగె కల్పనా కృష్ణమూర్తి, ఎంపీటీసీ పోలం కృపాకర్రెడ్డి, దుర్గంపేటలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గండు రామకృష్ణ, ఊరుగొండలో వైస్ ఎంపీపీ జాకీర్అలీ, కోగిల్వాయిలో సర్పంచ్ విష్ణువర్థన్రెడ్డి, ఎంపీటీసీ సంగనబోయిన మౌనికా కిరణ్, మండల కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్అక్తర్, పీఏసీఎస్ డైరెక్టర్ గుండా సంబురాలు జరుపుకున్నారు. స్వీట్లు పంచుకుని సంబురాలు జరుపుకున్నారు. బీఆర్ఎస్ ఏర్పాటుపై వెంకటాపురం, పులుకుర్తి, పసరగొండ, ఓగులాపురం, దమ్మన్నపేట గ్రామాల్లో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. సర్పంచ్ పున్నం రజితా సంపత్, గోవిందు అశోక్, మేడిపల్లి సాంబయ్య, గోగుల సత్యనారాయణరెడ్డి, కేతిపల్లి సరోజన, పుల్యాల రాణీ రఘుపతిరెడ్డి, కుక్క శ్రావణ్యా అనిల్, మాజీ సర్పంచ్ హింగె శ్రీనివాస్, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మెంతుల రాజు పాల్గొన్నారు.
ఐనవోలు: మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శంకర్రెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు జరుపుకున్నారు. సొసైటీ వైస్ చందర్రావు, మాజీ ఆలయ కమిటీ చైర్మన్ మునిగాల సంపత్కుమార్, పార్టీ శ్రేణులతో కలిసి పటాకులు కాల్చి స్వీట్లు పంచుకొని, నినాదాలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటన మరో మైలురాయిగా నిలుస్తుందని, దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుతారని వారు తెలిపారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
ఎల్కతుర్తి: మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో బీ(టీ)ఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి స్వీట్లు పంచారు. ఎంపీపీ మేకల స్వప్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గొడిశాల సమ్మయ్యగౌడ్, రైల్వే బోర్డు మెంబర్ ఎల్తూరి స్వామి, మార్కెట్ డైరెక్టర్ తంగెడ మహేందర్, నాయకులు గొడిశాల వినయ్, అఖిల్, జూపాక జడ్సన్, మహేందర్రెడ్డి, రాజుకుమార్, కడారి మురళి, సందల నరేశ్, వంచనగిరి స్వామి పాల్గొన్నారు.
కమలాపూర్: మండల కేంద్రంలో బీ(టీ)ఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడపాలంటే కేసీఆర్తోనే సాధ్యమని వారు అన్నారు. సింగిల్ విండో చైర్మన్ సంపత్రావు, సర్పంచ్ మాట్ల రవీందర్, నాయకులు పాక రవీందర్, మారపల్లి నవీన్కుమార్, మౌటం కుమారస్వామి, పల్లె సమ్మిరెడ్డి, శనిగరపు సమ్మయ్య, మాడిశెట్టి చంద్రశేఖర్, ఒల్లాల శ్రీనివాస్, కొలిపాక రమాకాంత్ పాల్గొన్నారు.
హనుమకొండ చౌరస్తా: సీఎం బీఆర్ఎస్ ప్రకటించడంతో బీ(టీ)ఆర్ఎస్ నాయకులు హనుమకొండ చౌరస్తాలో సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, చెన్నం మధు, కార్పొరేటర్ తాడిశెట్టి విద్యాసాగర్, టీఆర్ఎస్ నాయకులు పులి రజినీకాంత్, 7వ డివిజన్ అధ్యక్షుడు కొండా శ్రీనివాస్, నలుబోలు సతీశ్, అరవింద్కుమార్ పాల్గొన్నారు.
ధర్మసాగర్: మండలంలోని పలు గ్రామాల్లో బీ(టీ)ఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కొత్త పార్టీని ప్రజలు స్వాగతిస్తున్నారని, కేసీఆర్ నాయకత్వం చాలా అవసరమని వారు అన్నారు. పార్టీ కరుణాపురం గ్రామ అధ్యక్షుడు సిక రవి, నాయకులు కమలేశ్, శ్యామ్, ప్రవీణ్, సతీశ్, సదన్, దయాకర్, జాన్సన్, రాజు పాల్గొన్నారు.
ఆత్మకూరు: మండలంలోని పలు గ్రామాల్లో బీ(టీ)ఆర్ఎస్ నాయకులు స్వీట్లు పంపిణీ చేశారు. పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.