జనగామ చౌరస్తా, అక్టోబర్ 5 : విజయదశమి పర్వదినం సందర్భంగా సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)గా ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రాంతీయ పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ఇకపై జాతీయ పార్టీగా ఆవితరించి బీఆర్ఎస్గా మార్పు చెందడంపై నా యకులు ఆనందం వ్యక్తం చేశారు. దేశ్కీ నేత కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేశ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న ప్రజారంజక పాలనను చూసి దేశ ప్రజలు సీఎం కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఊడ్గుల నర్సింహులు, జిల్లా నాయకులు పోకల లింగయ్య, రావెల రవి, బండ యాదగిరి, సేవెల్లి సంపత్, డాక్టర్ సుల్తాన్ రాజా, ఉల్లెంగల సందీప్, వేణుగుప్తా, నారోజు రామేశ్వరాచారి, మసిఉర్ రెహమాన్, మల్లిగారి రాజు, మిద్దెపాక లెనిన్, మామిడి లాజర్, పానుగంటి ప్రవీణ్, మురళి, పంతులు ప్రభాకర్, బక్క లక్ష్మణ్, కందుకూరి ప్రభాకర్, సురేశ్, సాయి పాల్గొన్నారు.
లింగాలఘనపురం : సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్రెడ్డి, కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సేవెల్లి సంపత్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన నేపథ్యంలో మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బుధవారం సీఎం కేసీఆర్, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చిత్రపటాలకు పార్టీ మండల అధ్యక్షుడు బస్వగాని శ్రీనివాస్గౌడ్ అద్వర్యంలో నాయకులు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలు దేశ వ్యాప్తంగా అమలు కావాలని దేశ ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. ఈ నేపధ్యంలో కేసీఆర్ సేవలను దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ క్రియాశీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్గ శ్రీశైలం, బోయిని రాజు, బొల్లంపెల్లి నాగేందర్, ఉడుగుల భాగ్యలక్ష్మి, గవ్వల మల్లేశం, బూడిద జయరాజేశ్వర్గౌడ్, మబ్బు కరుణాకర్, లింగాల వెంకటేశ్, గట్టగల్ల శ్రీహరి, బోయిని యాకుబ్, వేముల శ్రీనివాస్, బెజ్జం అశోక్, నీలం ఆగయ్య, మహేశ్, రాహుల్ పాల్గొన్నారు.
దేవరుప్పుల : టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మార్చి బీఆర్ఎస్గా ప్రకటించిన నేపధ్యంలో మండల కేంద్రంలో పార్టీ శ్రేణులు బుధవారం సంబురాలు జరుపుకున్నారు. పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు తీగల దయాకర్, చింత రవి, నాయకులు బస్వ మల్లేశ్, చామల విక్రంరెడ్డి నేతృత్వంలో జాతీయ రహదారిపై పటాకులు కాల్చి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశానికి దిశానిర్ధేశం చేసేందుకు నడుంబిగించిన కేసీఆర్ బీఆర్ఎస్ పేర జాతీయ పార్టీ స్థాపించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జేరిపోతుల సాయిలు, కోతి ప్రవీణ్, జోగు సోమనర్సయ్య, బొందుగుల సోమయ్య, తాటిపల్లి మహేశ్, తిరుమలేశ్, లొడంగి వెంకన్న, గొడుగు మల్లికార్జున్, వంగ అర్జున్, ఐలమల్లు, బీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు పందెనబోయిన మధు ముదిరాజ్, కారుపోతుల యాదగిరి, చిలుపురం సో మయ్య, గిరియాదవ్, అబ్బసాయిలు, గొడిశాల మ ల్లేశం పాల్గొన్నారు. సింగరాజుపల్లిలోని అల్లూరి సర్కిల్లో బీఆర్ఎస్ ఆవిర్బావ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కత్తుల విజయ్కుమార్, నాయకులు గడ్డం రాజు, మేకపోతుల నర్సింహులు, జోగు వీరన్న, చినబుచ్చిరెడ్డి పాల్గొన్నారు.
రఘునాథపల్లి : మండలంలోని బీఆర్ఎస్ శ్రేణులు బుధవారం సంబురాలు జరుపుకున్నారు. రఘునా థపల్లిలో పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ముసిపట్ల విజయ్, కోమల్లలో స్టేషన్ఘన్ఫూర్ నియోజక వర్గ ప్రచార కార్యదర్శి తాటికొండ వెంకటేశ్ యాదవ్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సీఎం కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి విజయ్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టి మరో చరిత్రను తిరుగరాయనున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు దుబ్బాక హరీశ్ గౌడ్, ఎస్సీ సెల్ నాయకులు కందుకూరి మల్లేశ్, నాయకులు బిర్రు మధు, అన్వేశ్, తాళ్లపల్లి ప్రవీణ్, నర్ర అశోక్, కన్నారపు రాములు, మేకల అజయ్, పేరబోయిన రాజు తదితరులు పాల్గొన్నారు.
బచ్చన్నపేట : మండల కేంద్రంతోపాటు పోచన్నపేట తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు టసాసులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. దేశంలో సమూల మార్పు తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్ధ్దారెడ్డి, ఫిరోజ్, కిష్టయ్య, బాలకృష్ణ, భాస్కర్, ఐలయ్య, బాలచందర్, మహేందర్రెడ్డి, సిద్దార్ధ తది తరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ ఆవిర్భావం దేశానికి శుభపరిణామమని బీఆర్ఎస్ యూత్ నాయకుడు వడ్డేపల్లి ఉపేందర్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
స్టేషన్ ఘన్పూర్ : సీఎం కేసీఆర్తోనే భారత దేశ రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని, పేదలకు మేలు జరుగుతుందని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్ అన్నారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన నేపథ్యంలో పార్టీ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్ ఆధ్వర్యంలో స్టేషన్ఘన్పూర్ బస్టాండు వద్ద జాతీయ రహదారిపై కార్యకర్తలతో కలిసి పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం ద్వారా దేశంలోని రైతులు, కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అమలు జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తాటికొండ సురేశ్కుమార్, మార్కెట్ వైస్చైర్మన్ చల్లా చందర్రెడ్డి, ఎంపీటీసీలు గన్ను నర్సింహులు, గుర్రం రాజు, సింగపురం దయాకర్, గోనెల రాజు, స్టేషన్ఘన్పూర్, తానేదార్పల్లి గ్రామ శాఖల అధ్యక్షులు మునిగెల రాజు, కంసాని రాజిరెడ్డి, మారపల్లి ప్రసాద్, ఆకారపు అశోక్, చింత శ్రీనివాస్, గుండె రంజిత్, ఉడుత కుమారస్వామి, బాల్నే రాజుకుమార్, మేకల అనిల్, అనిల్రెడ్డి, జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తి రూరల్ : టీఆర్ఎస్ను జాతీయ పార్టీగా మారుస్తూ బీఆర్ఎస్గా సీఎం కేసీఆర్ ప్రకటించడంతో పార్టీ శ్రేణులు మండల కేంద్రంలో సంబురాలు జరుపుకున్నాయి. ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చారు. వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడం నవశకానికి నాంది అని పేర్కొన్నారు. దేశంలో రైతురాజ్యం రావాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్రావు, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ వీరమనేని యాకాంతారావు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, వర్రె వెంకన్న, ఎడవెల్లి పురుషోత్తం, భూమ రంగయ్య, కమ్మగాని రమేశ్, ఎడవెల్లి కృష్ణ, పాము శ్రీనివాస్, లావుడ్యా దేవేందర్, దొంతమల్ల గణేశ్, వీరమనేని హనుమంతరావు, మామిండ్ల లక్ష్మణ్, కమ్మగాని వెంకటేశ్, ఎండీ గౌస్, లొంక మల్లేశ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
కొడకండ్ల : సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడంపై హర్షం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో అమ లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తం గా అమలు చేసేలా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైరన్ పేరం రాము, టీఎస్ ఈజీసీ సభ్యుడు అందె యాకయ్య, సర్పంచ్ పసునూరి మధుసూదన్, మండల ఉపాధ్యక్షుడు కైరోజు సత్యనారాయణ, మార్కెట్ డైరెక్టర్ కుందూరు అమరేందర్ రెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు దేశగాని సతీశ్, పట్టణాధ్యక్షుడు మసురం వెంకటనారాయణ, నాయకులు కోటగిరి కుమా ర్, ఎన్ సోమేశ్వర్ రావు, వల్లూరి రామస్వామి, బోయిని రమేశ్, దూలం సతీశ్, షన్నా, అందె వెంకన్న, మల్లేశ్, తాళ్ల శోభన్, భాను, కిరణ్, సంతోష్ పాల్గొన్నారు.