దుగ్గొండి, అక్టోబర్ 5: తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందడంపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు, సీఎం కేసీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున పటాకులు కాల్చి, ర్యాలీలు నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. ఇందులో దుగ్గొండి మండలకేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి స్వీట్లు పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలకంగా మారబోతున్నారని తెలిపారు. కేసీఆర్ తనదైన ముద్ర వేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజలు కోరుకునేలా తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అమలు చేసేందుకు కృషి చేస్తారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సుకినె రాజేశ్వర్రావు, ఊరటి మహిపాల్రెడ్డి, ఓడేటి తిరుపతిరెడ్డి, పిండి కుమారస్వామి, మేరుగు రాంబాబు. బొమ్మగాని వెంకన్న, నూతనకంటి శ్రీనివాస్, కుమారస్వామి, కోటి, జనార్దన్రెడ్డి, రాజు, సాయని రాజు, సంజీవరెడ్డి పాల్గొన్నారు.
నర్సంపేట/చెన్నారావుపేట/ఖానాపురం: నర్సంపేటలో బీ(టీ)ఆర్ఎస్ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. పార్టీ నేతలు, యూత్ శ్రేణుల ఆధ్వర్యంలో నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి నినదించారు. అనంతరం పటాకులు కాల్చి సంబురాల్లో పాల్గొన్నారు. నాయకులు గుంటి కిషన్, రాయిడి దుశ్యంత్రెడ్డి, దార్ల రమాదేవి, వెంకట నారాయణ, డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, పుట్టపాక కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. చెన్నారావుపేటలో మండల కన్వీనర్ కంది కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బీ(టీ)ఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ను జాతీయ పార్టీ బీఆర్ఎస్గా మార్పు చేయడంతో స్థానిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
పార్టీ కార్యాలయం ఎదుట పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పత్తినాయక్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీ, సర్పంచ్ కుండె మల్లయ్య, మాజీ జడ్పీటీసీ రాంరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు నరేందర్, పార్టీ గ్రామ అధ్యక్షుడు సాంబయ్య, మండల కో ఆప్షన్ సభ్యుడు గఫార్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందడంతో పార్టీ నేతలు ఖానాపురంలో పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఎంపీపీ వేములపల్లి ప్రకాశ్రావు, పార్టీ మండల అధ్యక్షుడు మహాలక్ష్మీ వెంకటనర్సయ్య, ఆర్బీఎస్ కన్వీనర్ కుంచారపు వెంకట్రెడ్డి, సర్పంచ్ బదావత్ బాలకిషన్, బూస అశోక్, మండల కో ఆప్షన్ సభ్యుడు మస్తాన్, మచ్చిక అశోక్, చెన్నూరి సత్యం, నాగార్జునరెడ్డి, ఉపసర్పంచ్ మేడిద కుమార్, శ్రీనివాస్, ఉపసర్పంచ్ సామేల్, బొప్పిడి పూర్ణచందర్ పాల్గొన్నారు.
రాయపర్తి/నర్సంపేటరూరల్/నెక్కొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజకీయాల్లోకి అరంగేట్రమే లక్ష్యంగా భారత రాష్ట్ర సమితిని ప్రకటించడంతో పార్టీ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్ సారథ్యంలో ఎంపీపీ జనుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, జిల్లా నాయకుడు బిల్ల సుధీర్రెడ్డి, రైతుబంబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ ఆకుల సురేందర్రావు మండలకేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పటాకులు కాల్చి ప్రజలకు మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు పూస మధు, గారె నర్సయ్య, ఎండీ నయీం, అయిత రాంచందర్, గజవెల్లి అనంత ప్రసాద్, ఉస్మాన్, ముద్రబోయిన సుధాకర్, చందు రామ్యాదవ్, ఉబ్బని సింహాద్రి, మన్నన్ పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీని ప్రకటించడం శుభపరిణామమని సర్పంచ్ల ఫోరం నర్సంపేట మండల అధ్యక్షుడు కొడారి రవన్న అన్నారు. మండలవ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు. రవన్న ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు.
కార్యక్రమంలో పార్టీ రామవరం గ్రామ అధ్యక్షుడు జినుకల విజేందర్, వార్డు సభ్యుడు వడ్లకొండ కిషన్, రమేశ్, నాయకులు శ్రీనివాస్, రాంబాబు, రాజు, రవి, సారంగం పాల్గొన్నారు. నెక్కొండలో పార్టీ శ్రేణులు ఘనంగా సంబురాలు నిర్వహించారు. అంబేద్కర్ కూడళిలో పటాకులు కాల్చి వేడుకలు జరిపారు. కార్యక్రమంలో ఎంపీపీ జాటోత్ రమేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సంగని సూరయ్య, సొసైటీ చైర్మన్ మారం రాము, కొనిజేటి భిక్షపతి, మండల నాయకులు చెన్నకేశవరెడ్డి, కొమ్మారెడ్డి రవీందర్రెడ్డి, గుంటుక సోమయ్య, సూరం రాజిరెడ్డి, తాటిపెల్లి శివకుమార్, కారింగుల సురేశ్, దీక్షకుంట సర్పంచ్ ఆలకుంట సురేందర్, దేవనబోయిన వీరభద్రయ్య, ఈదునూరి యాకయ్య, ఈదునూరి రమేశ్, దొనికెన సారంగపాణి, రావుల భాస్కర్రెడ్డి, బొడ్డుపెల్లి రాజు పాల్గొన్నారు. గుండ్రపల్లిలో బోంపెల్లి రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో నాయకులు పటాకులు కాల్చారు.
నల్లబెల్లి: టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో నల్లబెల్లి మండలవ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి. పార్టీ నాయకులు మండలకేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీ(బీ)ఆర్ఎస్ మండల కన్వీనర్ ఊడుగుల ప్రవీణ్, ప్యాక్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్రావు, మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి కొత్తపెల్లి కోటిలింగాచారి, క్లస్టర్ ఇన్చార్జి గందె శ్రీనివాస్గుప్తా, మామిండ్ల మోహన్రెడ్డి, మాలోత్ ప్రతాప్సింగ్, విడియాల ప్రభాకర్రావు, సర్పంచ్లు మామిండ్ల మోహన్రెడ్డి, చీకటి ప్రకాశ్, రవీందర్రెడ్డి, ఎల్లస్వామి, అమరేందర్రెడ్డి, ఎంపీటీసీలు జన్ను జయరావు, ఓదెల రవి, నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
పర్వతగిరి: జన హృదయ నేత సీఎం కేసీఆర్ నేతృత్వంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)తోనే దేశ దశ మారుతుందని పార్టీ మండల అధ్యక్షుడు రంగు కుమార్గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆదేశాల మేరకు పర్వతగిరిలోని చౌరస్తాలో నాయకులు, కార్యకర్తలతో కలిసి పటాకులు కాల్చి సంబురాలు నిర్వహించారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో మండలకేంద్రం మర్మోగింది. తెలంగాణ రాష్ట్ర దశ దిశను మార్చిన సీఎం కేసీఆర్ వల్లే దేశానికి ఉజ్వల భవిషత్ ఉంటుందన్నారు.
అనంతరం ర్యాలీగా వెళ్లి బస్టాండ్ ప్రాంతంలోని పర్వతగిరి మాజీ సర్పంచ్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తండ్రి జగన్నాథరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు చింతపట్ల సోమేశ్వర్రావు, ఎంపీటీసీ మాడ్గుల రాజు, ఉపసర్పంచ్ రంగు జనార్దన్, పార్టీ గ్రామ అధ్యక్షుడు మెరుగు వెంకటేశ్వర్లు, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సర్వర్, మాజీ జడ్పీటీసీ పంతులు, సోషల్ మీడియా కన్వీనర్ బొట్ల మధు, యూత్ మండల వైస్ ఉపాధ్యక్షుడు దొనికెన రాజు, నాయకులు చీదురు తిరుపతి, బొట్ల శ్రీకాంత్, బర్ల రాజశేఖర్, మాజీ ఎంపీటీసీ రాయపురం రమేశ్, వంగ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఖిలావరంగల్/వరంగల్ చౌరస్తా/కాశీబుగ్గ: టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో బుధవారం గ్రేటర్ వరంగల్ 37వ డివిజన్ గిరిప్రసాద్నగర్లో స్థానికులు సంబురాలు జరుపుకున్నారు. కాలనీ అధ్యక్షుడు ఎండీ ఉల్ఫత్ ఆధ్వర్యంలో పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ భవిష్యత్లో ప్రధానమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు గౌడ నరేశ్, భాగ్యమ్మ, అరుణ, విజయ, సులోచన, స్వప్న, రంజిత్, నందిని, ప్రేమలత, సమ్మక్క, రాజు, నరేశ్, సారంగపాణి, లత, గణేశ్ పాల్గొన్నారు. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 27, 36వ డివిజన్ నాయకులు, కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. కూడళ్లలో పటాకులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేశారు.
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రకటన చేయడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
ఈ సందర్భంగా కాశీబుగ్గ 14వ డివిజన్లోని ఎస్ఆర్నగర్ డబుల్ బెడ్రూం లబ్ధిదారులతోపాటు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పటాకులు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ ఎస్ఆర్నగర్ అధ్యక్షుడు పసులాది మల్లయ్య అధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ తూర్పాటి సులోచనా సారయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్తో దేశంలోని నిరుపేదలు, మైనార్టీలకు తగిన న్యాయం జరుగుతుందన్నారు. బంగారుతెలంగాణ మాదిరిగానే బంగారు భారత్గా మారుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్తోనే బడుగు బలహీన వర్గాలతోపాటు మైనార్టీలకు సముచిత న్యాయం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో 14వ డివిజన్ అధ్యక్షుడు ముడుసు నరసింహ, నాయకులు కేతిరి రాజశేఖర్, మచ్చర్ల స్టాలిన్, పొన్నం ప్రభాకర్, అమర్రాజ్ కుమార్, కేతిరి సమ్మక్క, నేరెళ్ల సరోజన, పసునూరి సరిత, కన్నం వినమాల, మధు, కృష్ణ, నరేశ్ పాల్గొన్నారు.