నర్సంపేట రూరల్, అక్టోబర్ 4 : ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గురిజాల గ్రామానికి చెందిన ఉమ్మాల్ల రాజుకు రూ.1.50 లక్షల ఎల్వోసీని ఎమ్మెల్యే అందించారు. రాజు కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ప్రమాదంలో చేయి కోల్పోయాడు. కృత్రిమ చేయి కోసం ఎమ్మెల్యే పెద్దిని కలిసి విన్నవించుకోగా వెంటనే ఆయన స్పందించారు. రూ.1.50లక్షల ఎల్వోసీని బాధిత కుటుంబానికి అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ వరంలాంటిదన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా బీరన్న ఆలయానికి సీసీ రోడ్డు నిర్మాణం కోసం గురిజాల కురమ సంఘం పెద్దలు ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని అందించారు. ఆలయానికి త్వరలోనే సీసీ రోడ్డు నిర్మాణం చేపడతామని ఎమ్మెల్యే పెద్ది ఈసందర్భంగా హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో గురిజాల గ్రామ అధ్యక్షుడు చిన్నపెల్లి నర్సింగం, సర్పంచ్ గొడిశాల మమతా సదానందం గౌడ్, ఎంపీటీసీ బండారు శ్రీలత-రమేశ్, క్లస్టర్ ఇన్చార్జి మోటూరి రవి, ఉప సర్పంచ్ మంచిక హరీశ్, రైతు సమన్వయ సమితి కన్వీనర్ అన్న కోమలా రాజమల్లు, మండల ఉపాధ్యక్షుడు అల్లి రవి, నాయకులు పత్రి కుమారస్వామి, ముదురు రమేశ్, కొంరయ్య, కురుమ సంఘం అధ్యక్షుడు డ్యాక శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ఆరె సుధాకర్, డ్యాక భిక్షపతి, రవి, మర్ద రవీందర్ పాల్గొన్నారు.