వరంగల్, అక్టోబర్ 4 : తెలంగాణ ప్రభుత్వంతోనే దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నా రు. భద్రకాళి ఆలయం చుట్టూ మాడ వీధుల నిర్మాణం కోసం రూ.20 కోట్లు విడుదల చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ నాయకులు మంగళవారం భద్రకాళి ఆలయం ఎదుట పాలాభిషేకం చేశారు. పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డితో కలిసి పాల్గొన్న దాస్యం వినయ్భాస్కర్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో ధూపదీప నైవేద్యాలకు నోచుకోని అనేక ఆలయాలకు పూర్వవైభవం వచ్చిందని అన్నారు. మాడ వీధుల నిర్మాణంతో భద్రకాళి దేవాలయ ఖ్యాతి మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అజీజ్ఖాన్, కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మీసురేందర్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు మాలకుమ్మరి పరశురాములు, ఎండీ షఫీ, సదాంత్, సృజన్ పాల్గొన్నారు.