వరంగల్, అక్టోబర్3: చారిత్రక ఓరుగల్లు కొంగు బంగారం భద్రకాళీ అమ్మవారి దేవాలయ మాడ వీధులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సోమవారం ప్రభుత్వం ఎస్డీఎఫ్ (స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) కింద రూ. 20 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భద్రకాళీ మాడ వీధుల నిర్మాణం కోసం రూ . 30 కోట్లు అంచనా వేశారు. నిధుల మంజూరు కోసం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ సర్కారు దృష్టికి తీసుకుపోయా రు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చారిత్రక దేవాలయాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మం జూరు చేస్తున్నారు. వరంగల్లోని ప్రసిద్ధ భద్రకాళీ దేవాలయంలో ప్రతి ఏటా అమ్మవారి శా కంబరీ ఉత్సవాలు, నవరాత్రులు, బ్రహ్మోత్సవా లు పెద్ద ఎత్తున జరుపుతారు. వేలాదిగా భక్తులు వస్తుంటారు. కాకతీయుల కాలం నాటి భద్రకాళీ అలయం ఇరుకుగా మారడం ఉత్సవాల సమయంతో అమ్మవారి ఊరేగింపు చేయడం ఇబ్బందిగా ఉండడంతో దేవాలయం చుట్టూ మాడ వీధులు నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భద్రకాళీ ఆలయం చుట్టూ మాడ వీధులు నిర్మాణం చేయడంతో ఆలయ రూపురేఖలు మారిపోనున్నాయి. ఆమ్మ వారి ఉత్సవాల సమయంలో నిర్వహించే రథోత్సవాలు, వాహ న సేవలు మాడవీధుల్లో జరుగనున్నాయి. భద్రకాళీ దేవాలయం చుట్టూ మాడ వీధుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
డీపీఆర్ సిద్ధం
భద్రకాళీ ఆలయం చుట్టూ మాడ వీధుల నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్ సిద్ధంగా ఉంది. దేవాదాయ శాఖ, కుడా ఆధ్వర్యంలో భద్రకాళీ ఆలయ మాడ వీధుల డీపీఆర్ను రూ పొందించారు. ఆరు నెలల కిత్రం దేవాదాయ శాఖ స్థపతి మాడ వీధుల నిర్మాణంపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి డీపీఆర్లో స్వల్ప మా ర్పులను సూచించారు. డీపీఆర్ సిద్ధంగా ఉండడం, ప్రభుత్వం మాడ వీధుల నిర్మాణానికి రూ. 20 కోట్లు విడుదల చేయడంతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
ఫలించిన చీఫ్ విప్ దాస్యం కృషి
ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ కృషి ఫలించింది. భద్రకాళీ ఆలయం చుట్టూ మాడ వీధుల నిర్మాణం కోసం నిధుల మంజూ రు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకపోయి నిధులు విడుదల చేయించారు. భద్రకాళీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మాడ వీధులకు నిధులు విడుదల చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.