ఖిలావరంగల్, అక్టోబర్3: ఈ నెల 31 వరకు జరుగనున్న క్లీన్ ఇండియా యువజనో త్సవాల్లో ప్రజలతో పాటు అధికారులు భాగస్వాములు కావాలని కలెక్టర్ బీ గోపి అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సేక రించి సరైన పద్ధతిలో తొలగించాలన్నారు. జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు, పౌరుల సహ కారంతో వ్యర్థాలను సేకరించి తొలగిస్తామని చెప్పారు. వ్యర్థాల సేకరణకు హాట్ స్పాట్లు, పర్యాటక స్థలాలు, గృహాలు, విద్యా సంస్థలు, బస్టాండ్, రైల్వేస్టేషన్, జాతీయ రహదారు లు, చారిత్రక, వారసత్వ భవనాలు, నీటి వనరులు వంటి ప్రాంతాల్లో వ్యర్థాలను సేక రించాలన్నారు. నెహ్రూ యువ కేంద్రం వరంగల్, యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి త్వ శాఖ భారత ప్రభుత్వం సౌజన్యంతో ఈ నెల 15న దేశాయిపేటలోని సీకేఎం కళాశా లలోయువ ఉత్సవ్ కార్యక్రమం ఉంటుందన్నారు. 15 నుంచి 29 ఏళ్ల లోపు వయసున్న యువతీయువకులకు జాతీయ సమైక్యత, సమగ్రత అనే అంశంపై వక్తృత్వ పోటీలు ఉంటాయన్నారు. 2017 నుంచి 2021 వరకు నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలో గెలు పొందిన వారు మాత్రం పోటీలో పాల్గొనవద్దని తెలిపారు. మరిన్ని వివరాలకు 0870-2958776, 630381830 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి సీహెచ్ అన్వేష్, అదనపు కలెక్టర్ హరిసింగ్, డీఆర్డీఓ సంపత్రావు, డీఎంహెచ్ఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.