న్యూఢిల్లీ: రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచన మేరకు ఆయన రాజీనామాను రాష్ట్రపత్రి ద్రౌపది ముర్ము తక్షణమే ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
2024 నుంచి కేంద్ర మంత్రి మండలిలో కొనసాగుతున్న రవ్నీత్ సింగ్ బిట్టూ వచ్చే ఏడాది పంజాబ్లో జరగనున్న ఎన్నికలపై దృష్టి సారించే అవకాశం ఉన్నదని సమాచారం. బిట్టూ 2024లో బీజేపీలో చేరి, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజ్యసభ స్థానానికి రాజస్థాన్ నుంచి ఆయన ఎన్నికయ్యారు.