వర్ధన్నపేట, అక్టోబర్ 3 : రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ సంస్కృతికి సీఎం కేసీఆర్ జీవం పోస్తున్నారని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో బతుకమ్మ పండుగ సందర్భంగా చెరువువద్ద సోమవారం ఎమ్మెల్యే బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీమాంధ్ర పాలకులు దశాబ్దాల తరబడి కేవలం ఆంధ్ర ప్రాంతానికి చెందిన పండుగలు, ఉత్సవాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ తెలంగాణ పండుగలు, సంస్కృతిని నిర్లక్ష్యం చేశారన్నారు. సీఎం కేసీఆర్ బతుకమ్మ పండగకు పూర్వవైభవం తీసుకొస్తున్నారన్నారు. అంతేకాక తెలంగాణ ఆడపడుచులకు తోబుట్టువుగా చీరలు అందిస్తూ వారి కుటుంబంలో సంతోషాన్ని తీసుకువస్తున్నాడన్నారు. అన్ని గ్రామాల్లో బతుకమ్మ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడానికి తనవంతుగా సహకారం అందిస్తున్నానని అన్నారు. నియోజకవర్గ ఆడపడుచులకు ఎమ్మెల్యే సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, సర్పంచ్ ఆరెల్లి స్రవంతి, ఉప సర్పంచ్ సతీశ్, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, ఎంపీటీసీ రజిత, మహిళలు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
పర్వతగిరి : మండలంలోని 32 మంది లబ్ధ్దిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే అరూరి రమేష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో మహిళలతో కలిసి కొద్ది సేపు బతుకమ్మ ఆడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బతుకమ్మ పండుగకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కమల, జడ్పీటీసీ సింగులాల్, పీఏసీఎస్ చైర్మన్ ఎం మనోజ్కుమార్ గౌడ్, మార్కెట్ డైరెక్టర్ ఏకాంతం గౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు సర్వర్, రైతు బంధు అధ్యక్షుడు చిన్నపాక శ్రీనివాస్, మండల అధ్యక్షుడు రంగు కుమార్గౌడ్, సర్పంచ్లు మాలతీ సోమేశ్వర్రావు, అమడగాని రాజు యాదవ్, బానోత్ వెంకన్న, ఎంపీటీసీలు మాడ్గుల రాజు, లావణ్యా ప్రవీణ్రావు, నాయకులు వంశీరావు, ఉప సర్పంచ్ రంగు జనార్దన్ పాల్గొన్నారు.
మన సంస్కృతి భవిష్యత్ తరాలకు అందించాలి
కాశీబుగ్గ : తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడి ముందు తరాలకు అందించే బాధ్యత అందరి పై ఉందని ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. సోమవారం 3వ డివిజన్లోని కొత్తపేటలో బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహిళలతో బతుకమ్మ ఆడి పాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో ప్రకృతిని ఆరాధించే సంస్కృతి మన దన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జన్ను షీబారాణి, రైతు బంధువు సమితి జిల్లా అద్యక్షురాలు లలితాకుమార్ యాదవ్, పీఏసీఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, 3వ డివిజన్ అధ్యక్షుడు నేరెళ్ల రాజు, నాయకులు జన్ను అనిల్, బుద్ద వెంకన్న, ఆదాం, నేరేళ్ల భిక్షపతి, మంతురి కుమార్యాదవ్, పండుగ రవీందర్రెడ్డి, బొచ్చు రాజు, ఇట్యాల సతీశ్, కొండా కుమారస్వామి, బింగి మధు పాల్గొన్నారు. అలాగే 3వ డివిజన్ పైడిపల్లి ఎల్లమ్మగుట్ట సమీపంలో మహిళలు బతుకమ్మ ఆడారు.