మరిపెడ, అక్టోబర్ 3 : దేశ రాజకీయాల్లో మార్పు తథ్యమ ని, అది సీఎం కేసీఆర్తోనే సాధ్యమని ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. మరిపెడ మున్సిపల్ కేంద్రంలో సోమవారం ఆమె ఎమ్మెల్యే రెడ్యానాయక్తో కలిసి పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ నవీన్రావు, పార్టీ శ్రేణులు భారీస్వాగతం పలికారు. పట్టణంలో రూ.2 కోట్లతో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు, రూ.4కోట్లతో నిర్మించిన మోడల్ మార్కెట్, రూ.కోటి30లక్షలతో 26డబుల్బెడ్రూం లు, రూ.17లక్షలతో వైకుంఠధామం, రూ.40లక్షలతో ఎస్సీ కాలనీలో ఓపెన్ జిమ్, లైటింగ్ సిస్టం, బతుక మ్మ ఘాట్ను ప్రారంభిచారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ..చావు అంచుల దాకా వెళ్లి తెలంగాణ రాష్ట్రం సాధించిన మహనీయుడు సీఎం కేసీఆర్ అని, జాతీయస్థాయి రాజకీయాల్లోనూ తన చరిష్మా చూపిస్తారని అన్నా రు. సమైక్యరాష్ట్రంలో తెలంగాణ వనరులు దోపిడీకి గురై పల్లెజీవనం అస్తవ్యస్తంగా మారిందన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఒక్కొ క్క రంగాన్ని అభివృద్ధి చేస్తూ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని అన్నారు. గొల్ల కురుమలు, మత్య్సకారులు, చేనేత, గీత కార్మికుల అభివృద్ధికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని వివరించారు. దళితబంధు పథకంతో దళిత జీవితాల్లో వెలుగులు నింపారని, గిరిజన రిజర్వేషన్లను 6శాతం నుంచి 10శాతానికి పెంచి చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని అన్నారు. బీజేపీ ఒంటెద్దు పోకడలతో విసిగిన దేశంలోని పలు రా ష్ర్టాలు కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నాయన్నారు.
ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో మరిపెడ మున్సిపాలిటీ ప్రగతిపథంలో పయనిస్తున్నదని, రూ.20కోట్లతో అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే రెడ్యానాయక్ తెలిపారు. పట్టణంలో రూ.2కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియం జిల్లాకు తలమానికంగా మారిందని, సమీకృత మార్కెట్తో చిరువ్యాపారుల కష్టాలు తీరినట్లు చెప్పారు. మూడు జిల్లాల కూడలి ఉన్న మున్సిపాలిటీకి కార్పొరేట్ తరహా కంపెనీలు తరలివస్తున్నాయని, నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతున్నదన్నారు. ్రఈ కార్యక్రమంలో రామడుగు అచ్యుత్రావు, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు డీఎస్ రవిచంద్ర, మున్సిపల్ చైర్పర్సన్ గుగులోత్ సింధూరాకుమారి, ఎంపీపీ గుగులోత్ అరుణ, జడ్పీటీసీ తేజావత్ శారద, మాజీ ఎంపీపీ గుగులోత్ వెంకన్న, ఓడీసీఎంఎస్ మాజీ చైర్మన్ కుడితి మహేందర్రెడ్డి, వైస్ చైర్మన్ ముదిరెడ్డి బుచ్చిరెడ్డి, వైస్ ఎంపీపీ గాదే అశోక్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు తాళ్లపల్లి శ్రీనివాస్, మచ్చ వెంకట్రామ్నర్సయ్య, ఉప్పల వెంకటేశ్వర్లు, తల్లాడ వెంకటరామారావు, టీఆర్ఎస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు అజ్మీరా రెడ్డి, జాటోత్ బాలాజీ, పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు దిగజర్ల శ్రీనివాస్, లతీఫ్, మక్సూద్, తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీవో ధన్సింగ్, రంజిత్రెడ్డి, పరశురాములు, హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.