మహబూబాబాద్, అక్టోబర్ 1 : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, జడ్పీ కార్యాలయాల్లో ఎమ్మెల్యే శంకర్నాయక్, జడ్పీ చైర్పర్సన్ బిందు బతుకమ్మ వేడుకలు శనివారం నిర్వహించారు. ఏడో రోజు బతుకమ్మ వేపకాయల బతుకమ్మ సందర్భంగా ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్నాయక్ సతీమణి సీతామహాలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తేళ్ల శ్రీను, పట్టణ యూత్ అధ్యక్షుడు యాళ్ల మురళీధర్రెడ్డి, మార్నేని వెంకన్న, రఘు, టీఆర్ఎస్ నాయకులు, మహిళలు, జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ ఆధ్వర్యంలో నిర్వహించగా జడ్పీ సీఈవో.రమాదేవి, జడ్పీటీసీలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంపు, జడ్పీ కార్యాలయాలకు మహిళలు బతుకమ్మలతో వచ్చారు. డీజే పాటలకు ఎమ్మెల్యే శంకర్నాయక్ దంపతులు, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ ఆంగోతు బిందు స్టెప్పులు వేశారు. బతుకమ్మ పాటలు, కోలాటాలతో మహిళలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో వేడుకలు వచ్చిన వారందరినీ ఆకట్టుకున్నారు. కాగా, మహబూబాబాద్ నియోజకవర్గంలోని కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు, మహబూబాబాద్ రూరల్, పట్టణానికి చెందిన వారికి ఎమ్మెల్యే శంకర్నాయక్-సీతామహాలక్షీ దంపతులు బతుకమ్మ పాటలు, కోలాటాలకు వేర్వేరుగా పోటీలు నిర్వహించారు. ఉత్తమ బతుకమ్మ డ్యాన్స్, కోలాటాల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన వారికి నగదు బహుమతులను అందజేశారు.
మహిళా వార్డు కౌన్సిలర్లు, మెప్మా ఆర్పీలు ఈ పోటీల్లో పాల్గొని అలరించారు. అదే విధంగా కోలాటాల్లో కోరుకొండపల్లి, తాళ్లపూసపల్లి, మున్సిపాలిటీ పరిధిలోని 23 వ వార్డుకు చెందిన కోలాటాల బృంధాల మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. డీజేలు, కోలాటాల చిర్రలతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మార్మోగిపోయింది. జిల్లా కేంద్రంలో పలు దేవాలయాలు, జిమ్ సెంటర్లో బతుకమ్మ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో మహబూబాబాద్ జడ్పీ సీఈవో రమాదేవి, జడ్పీటీసీ లూనావత్ ప్రియాంక, గూడూరు ఎంపీపీ సుజాత, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మారిపెల్లి మాధవి, గుండు సులోచన, గోగుల అనురాధ రాజు, దాము, మీరా, మెప్మా ఆర్పీలు జహారా పాల్గొన్నారు.
తొర్రూరు: బతుకమ్మ వేడుకలను శనివారం రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో తొర్రూరు ఆర్డీవో ఎల్ రమేశ్ పాల్గొని బతుకమ్మ విశిష్టతను తెలియపరుస్తూ తెలంగాణ ప్రభు త్వం ఆడపడుచుల ఆత్మగౌరవానికి విలువనిస్తూ అధికారికంగా బతుకమ్మను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ వేడుకల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ పసుమర్తి శాంత, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ డాక్టర్ ఎస్.నాగవాణి, ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు ధరావత్ విమ ల, స్థానిక కౌన్సిలర్ ధరావత్ సునీత జైసింగ్, తహసీల్దార్ వి.రాఘవరెడ్డి, గిరిజన సమన్వయ కమిటీ అధ్యక్షుడు ధరావత్ జైసింగ్నాయక్, పంచాయతీ కార్యదర్శులు, దుబ్బతండా, రిక్షాకాలనీలోని మహిళలు పాల్గొన్నారు.
దంతాలపల్లి: మండల కేంద్రలోని ప్రభుత్వ దవాఖానలో శనివారం బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, సిబ్బంది బతుకమ్మ ఆడారు. ఈ సంబురాల్లో జిల్లా వైద్యాధికారి హరీశ్ రాజ్, డిప్యూటీ డీఎంహెచ్వో మురళీధర్, వైద్యాధికారి వేదకిరణ్, విజయరెడ్డి, సీహెచ్వో బాలాజీ పాల్గొన్ని సిబ్బందితో కలిసి నృత్యాలు చేశారు.
మరిపెడ: మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో స్థానిక హిందూ ముస్లిం మహిళలు సమైక్యంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మత సామరస్యతను చాటుకున్నారు. బతుకమ్మ పర్వదినం అన్ని వర్గాల మహిళల సొంతం అని చాటుకున్నారు.
కేసముద్రం: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్ అజీజ్బేగ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిక, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బతుకమ్మ పండుగ నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు గిరి, రమేశ్, సంతోష్, కొమ్మాల్, కూటికంటి మధు, వీరన్న, ప్రసాద్, బాలకృష్ణ, రాజశేఖర్ ఉన్నారు.