బయ్యారం, అక్టోబర్ 30 : గిరిజన పక్షపాతి సీఎం కేసీఆర్ అని జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిం దు పేర్కొన్నారు. గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంపును హర్షిస్తూ లండాడి ఐఖ్య వేదిక (లైవ్) ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్లోని అంబేద్కర్ వి గ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీఎం కేసీఆర్, మంత్రి సత్యవతి రా థోడ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో లైవ్ మండలాధ్యక్షుడు జరుపుల శ్రీనివాస్, మండల ప్రధాన కర్యాదర్శి మంగీలాల్, ఎంపీటీసీ సోమేశ్, టీఆర్ఎస్ జిల్లా నాయకులు అంగోత్ శ్రీకాంత్, భూక్యా ప్రవీణ్, నాయకులు నాగు నాయక్, రాజు, కోటేశ్వరావు, రూప్లా, బా వుసింగ్, రవి తదితరులు పాల్గొన్నారు.
మహబూబాబాద్ రూరల్: సీఎం కేసీఆర్తోనే గిరిజనులకు అభివృద్ధని టీఆర్ఎస్ మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు గుగులోత్ రామచంద్రు నాయక్ అన్నారు. శనివారం మండల పరిధిలోని రేగడితం డా పంచాయతీలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇస్తూ జీవో జారీ చేయడంపై సీఎం కేసీఆర్ చిత్రపటానికి గిరిజన నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. సర్పంచ్ గుగులోత్ లక్ష్మి, పార్టీ అధ్యక్షుడు బానోత్ బెంజీ నాయక్, మంగీలాల్, మాలు, లింగు పాల్గొన్నారు.
డోర్నకల్: గిరిజనుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నున్న రమణ అన్నారు. శనివారం 10 శాతం గిరిజనుల రిజర్వేషన్ జీవో అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ డోర్నకల్ మసీద్ సెంటర్లో పటాకులు పేల్చి, సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే రెడ్యానాయక్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కేశబోయిన కోటిలింగం, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కే విద్యా సాగర్, ఎంపీటీసీ బాణోత్ శంకర్ కోటి, వార్డు కౌన్సిలర్లు కాలా సురేందర్ కుమార్ జైన్, పోటు జనార్దన్, బసిక అశోక్,మున్సిపల్ కో ఆప్షన్ సభ్యు డు అజిత్ మియా, రాంభద్రం, టీఆర్ఎస్ నాయకులు కొత్త వీరన్న,పోకల శేఖర్,ఏపూరి వెంకటేశ్వర్లు, కాలా యశోధర్ జైన్, కందుల మధు, నల్లబోలు శ్రీనివాస్, ధారావత్ కృష్ణ, ఉపేందర్, పచ్చిపాల శ్రీనివాస్, గౌస్, తదితరులు పాల్గొన్నారు.
కురవి: గిరిజనుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని మహబూబాబాద్ మార్కెట్ చైర్ పర్సన్ బజ్జూరి ఉమాపిచ్చిరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం.. గిరిజన రిజర్వేషన్ 10 శాతం పెంపు జీవో విడుదల సందర్భంగా టీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ చిత్రపటానికి శనివారం పాలాభిషేకం చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మరిపెడ ఆత్మచైర్మన్ తోట లాలయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకులు బజ్జూరి పిచ్చిరెడ్డి, టీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ గుగులోత్వ్రి, ఆలయ చైర్మన్ రామునాయక్, మాజీ ఆలయ చైర్మన్ రాజునాయక్, వైస్ ఎంపీపీ నర్సయ్య, ఎంపీటీసీలు చిన్నం భాస్కర్, నరేశ్, అర్జున, బోజ్యానాయక్, సర్పంచ్లు అమ్రీబాయి, నర్సింహారావు, తోట రమేశ్, రామునాయక్, యతిరాజ్, సూర్య, శోభన్, బీ వీరన్న, రాజన్న, దేవేందర్, సంజీవ, సురేశ్, రాములు, రవి తదితరులు పాల్గొన్నారు.
గార్ల: సీఎం కేసీఆర్ దసరా కానుక 10 శాతం రిజర్వేన్ల జీవో 33 అమలుతో మండల కేంద్రంలోని ఎమ్మెల్యే బాణోత్ హరిప్రియానాయక్ క్యాం పు కార్యాలయంలో శనివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ మాట్లాడారు. రిజర్వేషన్ 10 శాతం పెంపుతో గిరిజన తండాల్లో వెలుగులు వస్తాయన్నారు. గిరిజన కుటుంబాలు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పానుగంటి రాధ కృష్ణ, ఎస్టీ సెల్ మండల నాయకులు మాలోత్ రమేశ్, పట్టణ కార్యదర్శి ఇస్లావత్ రావూజీ, ఎంపీటీసీ ఫోరం మండల అధ్యక్షుడు శీలంశెట్టి రమేశ్, ఆడేపు వెంకటేశ్వర్లు, తోట కోండల్ రావు, పల్లెబోయిన లింగయ్య, శంకర్, శివాజీ, ఉమేశ్ పాల్గొన్నారు.
మరిపెడ: గిరిజనుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ రిజర్వేషన్ను 6 శాతం నుంచి 10కి పెంచడం దేశంలోనే చరిత్రాత్మకమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్రావు పేర్కొన్నారు. శనివారం మున్సిపల్ కేంద్రంలోని వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిలోని గాంధీ చౌక వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి గిరిజన ప్రజాప్రతినిధులు కలిసి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు రామడుగు అచ్చుత్రావు, ఎంపీపీ గుగులోత్ అరుణ, జడ్పీటీసీ తేజావత్ శారద, మున్సిపల్ చైర్ పర్సన్ గుగులోత్ సింధూరకుమారి, రైతుబంధు జిల్లా సమితి సభ్యులు పానుగోతు వెంకన్న, జర్పుల కాలునాయక్, మాజీ ఓడీసీఎంఎస్ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గుగులోతు వెంకన్న,వైస్ ఎంపీపీ గాదే అశోక్ రెడ్డి, విసారపు శ్రీపాల్ రెడ్డి, టీఆర్ఎస్ ఎస్టీ సెల్ మండల, పట్టణ అధ్యక్షుడు అజ్మీరా రెడ్డి, జాటోత్ బాలజీ, అజ్మీరా హరినాయక్, కేలోత్ వస్రంనాయక్, పద్మశాలీ సంఘం మండలాధ్యక్షుడు దిగజర్ల శ్రీనివాస్, గోల్కొండ వెంకన్న, ఎడెల్లి పరుశురాములు, మాచర్ల భద్ర య్య,వాసవీ క్లబ్ ప్రతినిధులు వుల్లి శ్రీనివాస్, పీఏసీఎస్ డైరక్టర్ బాలకిషన్ పాల్గొన్నారు.
తొర్రూరు: రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్ను 10 శాతానికి పెంచుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయడంపై గిరిజనులు, టీఆర్ఎస్ నేతలు ఆనందాన్ని వ్యక్తం చేసి సంబురాలు నిర్వహించారు. శనివారం డివిజన్ కేంద్రం లో బస్టాండ్ వద్ద పటాకులు పేల్చి, తెలంగాణ తల్లి విగ్రహం ముందు గిరిజన సమన్వయ సమితి కమిటీ అధ్యక్షుడు ధరావత్ జైసింగ్నాయక్, మం డల ఎస్టీ సెల్ అధ్యక్షుడు స్వామినాయక్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, మున్సిపల్ చైర్మన్ మం గళపల్లి రామచంద్రయ్య, ఎంపీపీ తూర్పాటి చిన్నఅంజయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, సీనియర్ నాయకుడు పీ సోమేశ్వర్రావు, వైస్ చైర్మన్ జినుగ సురేందర్రెడ్డి, బానోత్ కిషన్నాయక్, మాలోత్ కాలునాయక్, హపావత్ సురేశ్నాయక్, జాటోత్ రమేశ్, పాడ్య రమేశ్, సరస్వతి, సోమ్లానాయక్, బోజ్యానాయక్, సర్పంచ్లు, కౌన్సిలర్లు ఎన్నమనేని శ్రీనివాస్ రావు, అనిల్, టీకునాయక్, కిషన్నాయక్, సరేశ్, శోభన్, భూక్యా బాసు, రవి, భాస్కర్, సోమేశ్, శశికుమార్, రమేశ్, వెంకన్న, యాకేశ్, రాములు, శ్రీనివాస్, భిక్షపతి, శ్రీను, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
చిన్నగూడూరు: గిరిజనుల సమగ్రాభివృద్ధి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని టీఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు రాంసింగ్, దారాసింగ్ అన్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ అమలుపై కేసీఆర్ ప్రభుత్వం జీవో విడుదల చేయడంపై ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలోని దాశరథి సెంటర్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు చెన్నారెడ్డి, మాజీ కేసముద్రం మార్కెట్ డైరెక్టర్ చెన్నయ్య, సర్పంచ్ మల్లయ్య కోఆప్షన్ సభ్యులు మోసిన్బేగ్, నాయకులు రాము, శ్రీను, జనార్దన్, ఉపేందర్, శంకర్, శ్రీరాములు, ఆయా గ్రామాల టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
నర్సింహులపేట: గిరిజన భవనం ప్రారంభోత్పవం సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం.. గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతూ జీవో జారీ చేయడంపై మండల వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. శనివారం మండల కేం ద్రంలో పటాకులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు మైదం దేవేందర్ మాట్లాడారు. గిరిజనులు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ జాటోతు దేవేందర్, సర్పంచ్,ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు శంకర్గౌడ్, గుగులోత్ రవి, సర్పంచ్లు, నాయకులు హోలీ, సీతారాంనాయక్, సురేశ్, ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు అజ్మీరా వంశీ, కిషన్నాయక్, ఉదయ్, వెంకట్రెడ్డి తదితరులు ఉన్నారు.
దంతాలపల్లి: గిరిజనలు ఆరాధ్య దైవం సీఎం కేసీఆర్ అని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దర్మరాపు వేణు అన్నారు. కేసీఆర్ గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం.. 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్న ట్లు జీవో విడుదల చేయడంతో శనివారం మం డల కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు గుగులోత్ పోట్యానాయక్ ఆ ధ్వర్యంలో పటాకులు పేల్చి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ మార్కెట్ కమిటీ డైరక్టర్ కిశోర్కుమార్, సర్పంచ్లు సోమ్లానాయక్, పెండ్యాల నరేశ్, గిరిజన నాయకులు బద్రూనాయక్, లక్ష్మణ్, కిషన్, శ్రీను, అంకం సోమేశ్వర్, నాగన్న, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.