నర్సంపేట, అక్టోబర్ 1: ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎంతో రుణపడి ఉన్నామని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్ అన్నారు. గిరిజనులకు 6 నుంచి 10 శాతానికి రిజర్వేషన్ పెంచి జీవో జారీ చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం నర్సంపేటలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ ఫొటోను గిరిజనులు తమ ఇళ్లల్లో పెట్టుకొని పూజిస్తారని తెలిపారు.
గిరిజన ఆరాధ్య దైవమైన సేవాలాల్ ఆంధ్రలో పుట్టి దేశంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరాధ్య దైవమయ్యారని కొనియాడారు. తండాలను గ్రామ పంచాయతీలుగా చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. గిరిజనులు, ఆదివాసీలకు హైదరాబాద్లో భవనాలు నిర్మించారని గుర్తుచేశారు. గిరిజనుల జనాభా ప్రకారం రిజర్వేషన్ శాతాన్ని పెంచడమే కాకుండా 33 జీవో జారీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి గిరిజనులకు రిజర్వేషన్ను అమలు చేయడం సంతోషంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ వెంటే గిరిజనులు ఉంటారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు వాసునాయక్, డాక్టర్ ఉదయ్సింగ్, జగన్నాయక్, జడ్పీటీసీలు పత్తినాయక్, సరోజన, ఎంపీపీలు విజేందర్, రమేశ్, బద్దూనాయక్, గోల్యానాయక్ పాల్గొన్నారు.
చెన్నారావుపేట: గిరిజనుల ఆత్మబంధువు కేసీఆర్ అని గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంగోత్ భద్రయ్య అన్నారు. రిజర్వేషన్ పెంచుతూ జీవో జారీ చేసినందుకు ముఖ్యమంత్రికి గిరిజన ఉద్యోగుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పోరాడి సాధించిన తెలంగాణలో దసరా కానుకగా గిరిజనుల రిజర్వేషన్ పెంచిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో వీరన్న, రవి, భద్రు, రమేశ్, స్వామి, నర్సయ్య, వెంకటయ్య పాల్గొన్నారు.