పరకాల, సెప్టెంబర్ 29 : తెలంగాణ రాష్ట్రంపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు గురువారం టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తుందని, టీఆర్ఎస్ పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. సంక్షేమ పథకాలు గడపగడపకు అందుతున్నాయని, సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితులై ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు టీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. బీజేపీ నాయకులు రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు.
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులదేనని అన్నారు. పార్టీలో చేరినవారిలో పల్లెబోయిన రాజయ్య, పల్లెబోయిన ఓదెలు, పీ రమేశ్, వీ ప్రశాంత్, రాజు, నరేశ్, వంశీ, సంపత్, రవీందర్, మధు, మనోజ్, ఓదెలు, కృపాకర్, లడ్డు ఉన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఆముదాలపల్లి అశోక్, గురిజపల్లి ప్రకాశ్రావు, పల్లెబోయిన సురేశ్, పార్టీ గ్రామ అధ్యక్షుడు రాజు, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పార్టీలకతీతంగా పథకాల అమలు
సంగెం : పార్టీలకతీతంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని వెంకటాపురం, కాట్రపల్లి, గవిచర్ల, రాంచంద్రాపురం, లోహిత, షాపురం గ్రామాల్లో గురువారం పింఛన్లు పంపిణీ చేశారు. వెంకటాపురం గ్రామంలో రూ.60 లక్షలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి, బతుకమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాట్రపల్లి గ్రామంలో రూ. 54.52 లక్షలతో అభివృద్ధి పనులు, గవిచర్ల గ్రామంలో రూ.10.75 లక్షలతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లు, రాంచంద్రాపురం గ్రామంలో రూ 1.69 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, లోహిత గ్రామంలో రూ.20 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్ల పనులు ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రారంభించారు.
అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న ఏకైక సీఎం కేసీఆరేనని అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల మందికి పింఛన్లు ఇచ్చిన మహనీయుడు పేర్కొన్నారు. వరంగల్ జిల్లా రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, ఎంపీపీ కందకట్ల కళావతి, జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, సర్పంచ్లు పూజారి ఉమాదేవి, పూలుగు సాగర్రెడ్డి, దొనికెల రమ, బొంపెల్లి జయశ్రీ, సట్ల రాజు, ఎంపీటీసీలు గాయపు ప్రచూర్ణ, గూడ సంపత్రెడ్డి, చిదిరాల రజిత, అడ్డగట్ల దుర్గారావు, చైర్మన్లు సంపత్, వేల్పుల కుమారస్వామియాదవ్, నాయకులు దొనికెల శ్రీనివాస్, పూజారి గోవర్ధన్గౌడ్, బొంపెల్లి దిలీప్రావు పాల్గొన్నారు.
అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం
ఖిలావరంగల్ : అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, సీఎం కేసీఆర్ కృషి, పట్టుదలతో సంక్షేమ పథకాలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్లోని గాడిపల్లిలో రూ.2.29 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే రూ.కోటితో వేసిన నూతన రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేసి మాట్లాడారు. గ్రేటర్ వరంగల్లోని విలీన గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. గ్రామానికి వచ్చే ప్రధాన రహదారిని డబుల్గా మార్చుతామన్నారు.
ఇందులో భాగంగా ఇళ్లు కోల్పోతున్న వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పా రు. బీజేపీ అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇస్తున్న దళిత బంధు, ఆసరా తదితర సంక్షేమ పథకాలను రద్దు చేయాలంటున్న కేంద్రానికి తగిన సమయంలో బుద్ధి చెప్పాలని సూచించారు. బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.15 లక్షలు వేస్తామని ప్రధాని మోదీ మోసం చేశాడని విమర్శించారు. గడిచిన 8 ఏండ్లుగా సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారన్నారు. కార్పొరేటర్ గద్దె బాబు, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు దామోదర్, నాయకులు తరగల ప్రసాద్రావు, సోల్తీ భూమాత, నరేందర్, జనుపాల హరీశ్, అలిమి శ్యాం, గొంగళ్ల సునీల్, జంగా రాకేశ్, వెలిసోజు సాయిచందర్, అఖిల్, శ్రీనివాస్, జనుపాల రాంబాబు పాల్గొన్నారు.