‘వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు.. ఇలా అందరికీ ఆసరా అవుతున్నాడు.ఎవరిపైనా ఆధారపడకుండా బతికేలా భరోసా ఇస్తున్నాడు.. పేదలు, అభాగ్యులను తోడబుట్టిన అన్న లెక్క ఆదుకుంటున్న కేసీఆర్తోనే దేశమంతా సం‘క్షేమ’ంగా ఉంటుంది’ అని పింఛన్ లబ్ధిదారులు స్పష్టం చేస్తున్నారు. పేదల కష్టాలు తీర్చే నాయకుడే ఇప్పుడు దేశానికి అవసరమని.. ఆ నాయకత్వ లక్షణాలు కేసీఆర్లో పుష్కలంగా ఉన్నాయని ధీమాగా చెబుతున్నారు. సబ్బండ వర్గాలవారు బాగుపడి దేశం ప్రగతిబాట పట్టాలంటే.. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాల్సిన అవసరమున్నదని అభిప్రాయపడ్డారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 28
‘తెలంగాణ వచ్చినంకనే ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు పింఛన్లు ఇచ్చి మా బతుకులకు భరోసా వచ్చింది. పేదోళ్లను ఆదుకునేందుకు ఎన్నో పథకాలు తెచ్చి.. అందరికీ ఆసరా అయితాండు. తెలంగాణ లెక్క అందరికీ గిట్ల మేలు జరగాల్నంటే కేసీఆర్ సారు దేశ రాజకీయాల్లో ఉండాల్సిందే’నని పింఛన్ లబ్ధిదారులు అభిప్రాయపడుతున్నారు. ఇదివరకున్న ప్రభుత్వాలు చాలీచాలని పింఛన్లు ఇచ్చేవని.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఎవరి వద్దా చేయిచాపే అవసరం లేకుండా ‘ఆసరా’ అవుతున్నారని చెబుతున్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బోదకాలు బాధితులు.. ఇలా అందరికీ నెలనెలా పింఛన్ డబ్బులు ఇస్తూ అండగా నిలుస్తున్నారని, అందరి కష్టాలు తీర్చే నాయకుడుంటే దేశంలోని పేదలందరికీ మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలను ఆదుకుంటూ పెద్దదిక్కుగా ఉంటున్న కేసీఆర్తోనే దేశ ప్రజలు సంతోషంగా ఉంటారని ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
పాలకుర్తి : వృద్ధులను ఆదుకున్న గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్. మాకు నెలనెలా రూ.2016 చొప్పున ఫించన్ ఇస్తూ ఆసరా అవుతున్నడు. ఇదివరకున్న ఏ ప్రభుత్వం కూడా మమ్ముల పట్టించుకోలేదు. అర్హతలున్న వారికి పింఛన్లు ఇవ్వలేదు. తెలంగాణ సర్కారు వచ్చినంకనే బతుకులకు భరోసా వచ్చింది. ఆ డబ్బులు మందులు, ఇంటి ఖర్చులకు ఎంతో ఉపయోగ పడుతున్నయ్. ఇంటికి పెద్ద కొడుకు లెక్క ఆసరా అయ్యే కేసీఆర్ లాంటి నాయకుడు ఉన్నంక మాకేం రంది. అందరినీ ఆదుకునే కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండుడు మన అదృష్టం. మన లెక్క దేశంలో ఉన్న పేదోళ్లకు పింఛన్లు, పథకాలు రావాలి. అప్పుడే దేశం బాగుపడుతది. అది కేసీఆర్ ఒక్కనితోనే అయితది.
– కమ్మగాని రాజమ్మ, ఆసరా పెన్షన్ లబ్ధిదారు, పాలకుర్తి
వెంకటాపూర్: తెలంగాణ రాక ముందు మాకు కేవలం రెండు వందల రూపా యలు మాత్రమే పింఛన్ వచ్చేది. ఇప్పుడు 2016 వస్తున్నాయి. కేసీఆర్ సర్కారు వచ్చుట్లనే మాకు ఆసరా దొరికింది. నాలాంటోళ్లకు ఆసరా పింఛన్ ఇచ్చుడే గాక ఆడబిడ్డల పెండ్లికి కల్యాణిలక్ష్మి, షాదీముబారక్.. ఎవుసానికి పెట్టుబడి ఇచ్చుకుంట ఆసరా అయ్యేందుకు రైతుబంధు, రైతు బీమా.. అట్లనే దళితబంధు పథకం తెచ్చి అందరినీ ఆదు కుంటాండు. ఇసోంటి నాయకుడు దేశ రాజకీయాల్లో ఉంటే తెలంగాణ లెక్క అందరికీ పథకాలు అందుతయ్. తెలంగాణ అన్నితీర్ల సౌలత్లు చేస్తున్నట్టు దేశంల కూడా చేస్తడు. ఆ దమ్ము కేసీఆర్కే ఉంది.
– మోలుగూరి బుచ్చయ్య, పాలంపేట
మరిపెడ : సీఎం కేసీఆర్ వచ్చినప్పటి నుంచి నాకు రూ.2వేల ఆసరా పింఛన్ అందుతాంది. ఇదివరకున్న ప్రభుత్వాలు మొదలు రూ.75 ఆ తర్వాత రూ.200 ఇచ్చే. అది కూడ రెండుమూడు నెలలకోసారి. తెలంగాణ వచ్చిన తర్వాత నెలనెలా ఠంచన్గా 2వేలు పడుతానయ్. చేతి ఖర్చులకు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుంట చేశిండు కేసీఆర్. కన్న కొడుకులు కూడ పట్టించుకోని ఈ రోజుల్లో కేసీఆర్ పెద్ద కొడుకు లెక్క ఆసరా అయితాండు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటం. కేసీఆర్ లాంటి నాయకుడు దేశంలోనూ సేవలు అందించాలి. మరింత మందికి ఆసరా కావాలి.
– వడ్డేనపు రామయ్య, మరిపెడ
నెక్కొండ : సీఎం కేసీఆర్ అందిస్తున్న ఆసరా పింఛన్ పేదలకు కొండంత భరోసా ఇస్తోంది. నెలకు రెండు వేల పింఛన్ ఇవ్వడం వల్ల వృద్ధుల కష్టాలు తీరుతున్నాయి. గొర్రెల కాపర్లమైన మాకు ప్రభుత్వం నుంచి 20 గొర్రెలు అందాయి. వాటిని మేపుకోవడంతో పాటు నెలనెలకు అందిస్తున్న పింఛన్తో కుటుంబం చల్లగా బతుకుతోంది. ఇలాంటి పథకం దేశంలో ఎక్కడాలేదు. కేసీఆర్తో తెలంగాణలోని పేదోళ్ల బతుకులు మారాయి. మత్స్యకారులకు చేపలు పంపిణీ చేసి వాళ్ల ఆదాయాన్ని బాగా పెంచారు. ఎంతోమంది పేదలకు ఆదాయమార్గాలు చూపెడుతున్నారు. సీఎం దేశ రాజకీయాల్లోకి వెళ్తే దేశం బాగుపడుతుంది. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నరు. పేదోళ్లను ఆదుకునేందుకు దేశంలో కొత్త కొత్త పథకాలు తెచ్చేలా చేస్తారు.
– రెడ్డబోయిన భిక్షపతి, ఫణికర, నెక్కొండ
పరకాల : ఆసరాతో ఎంతోమంది జీవితాల్లో వెలుగునింపిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్. వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధపడుతున్న ఎంతో మందికి నేనున్నానంటూ ఇంటికి పెద్దదిక్కులా ఆసరా అవుతున్నారు. సమైక్యపాలనలో ఇచ్చే అరకొర పింఛన్ సరిపోక చాలా ఇబ్బందులు పడే మాకు ప్రతి నెలా 3,016 ఇస్తూ మా జీవితాల్లో ఆనందాన్ని నింపారు. ఇలా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది జీవితాల్లో వె లుగులు నింపిన ఘనత కేసీఆర్కే దక్కుతుంది. అందరి బాగోగుల గురించి ఆలోచించే నాయకుడు దేశంలో ఉంటే మా లాంటి ఎంతోమందికి మేలు జరుగుతుంది. అందుకే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందే. రాష్ట్రంలో అందుతున్న పెన్షన్లు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తంగా అర్హులందరికీ దక్కాలి. అది కేసీఆర్ ఒక్కడితోనే సాధ్యమవుతుంది.
– ఒంటేరు చిరంజీవి, దివ్యాంగుడు, పరకాల
నర్సింహులపేట, సెప్టెంబర్ 27 : దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ మన రాష్ట్రంలో దివ్యాంగులకు రూ.3016 పింఛన్ ఇవ్వడం గర్వంగా ఉంది. ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్తే నా లాంటి ఎంతోమంది దివ్యాంగుల కష్టాల తీరి సంతోషంగా ఉంటారు. ఎవరికి ఏం ఇవ్వాలో.. ఎలా ఆదుకోవాలో తెలిసిన పాలకుడాయన. అందుకే ఎనిమిదేండ్లలో తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో నంబర్ వన్ చేసిండు. కేంద్రంలోని మోదీ సర్కారు సాయం చేయకుండా ఇబ్బందిపెడుతున్నా.. మనకోసం కేసీఆర్ అన్నీ చేస్తున్నడు. ముందుచూపు, అనుభవం ఉన్న కేసీఆర్ లాంటి నాయకుడు దేశంలో ఉంటే.. మన లెక్క అందరి బతుకులకు భరోసా దక్కుతుంది. కేసీఆర్తో దేశం అభివృద్ధి సాధిస్తుంది.
– ఎండీ ఖాజామియా, దివ్యాంగ పింఛన్దారు
సంగెం : కేసీఆర్ సారు ఇచ్చిన పింఛన్తో బతుకుతున్నా. పేదల బతుకుల్లో వెలుగు తెచ్చి అన్ని విధాలా ఆదుకుంటున్నడు. వితంతువులకు, వృద్ధులకు, దివ్యాంగులందరికీ నెలానెలా పింఛన్ ఇచ్చి ఆసరా అవుతున్నడు. ఇలాంటి నాయకుడు దేశంలో ఉంటే తెలంగాణలో ఉన్న పథకాలు పేదోళ్లందరికీ అందుతాయి. అందరికీ మంచి చేసే కేసీఆర్ లాంటి నాయకుడే ఇప్పుడు దేశానికి అవసరం. కేసీఆర్ వచ్చినంకనే తెలంగాణ మంచిగైంది. గట్లనే దేశం కూడా బాగుపడాల్నంటే కేసీఆర్ సారు ఢిల్లీకి పోవాలె. ఆయనతో ఏదైనా సాధ్యమే. కేసీఆర్ సార్కు మేమంతా ఉంటం. జై కేసీఆర్.
– గుంటి నిర్మల, పింఛన్దారు, సంగెం
జనగామ చౌరస్తా : ఒకరిపై ఆధారపడకుండా ప్రతినెలా రూ.3016 దివ్యాంగుల పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్నరు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు రూ.2016 ఇస్తున్నారు. ఇదివరకున్న ప్రభుత్వాల కంటే మా దివ్యాంగుల సంక్షేమం కోసం పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నది కేసీఆర్ ఒక్కరే. వీల్చైర్స్, టూ వీలర్స్తో పాటు అవసరమైన పరికరాలెన్నో అందించారు. పేదల యోగక్షేమాలు చూసే ఇలాంటి నాయకుడే కదా దేశానికి కావాల్సింది. పేదలు, దివ్యాంగుల పక్షపాతి అయిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఉండాలి. ఆయన వస్తేనే దేశంలోని నిరుపేదలు, దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలందరికీ ఒక ‘ఆసరా’ దొరుకుతుంది.
– పంతులు ప్రభాకర్రావు, నవ తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల ఫోరం జిల్లా అధ్యక్షుడు, జనగామ