డోర్నకల్, సెప్టెంబర్ 25: మహిళల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న అన్నారు. ఆదివారం 10వ వార్డులో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. తెలంగాణలోని ఆడబిడ్డలు బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సీఎం కేసీఆర్ కానుకగా ప్రతి సంవత్సరం చీరలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కే సురేందర్కుమార్ జైన్, డీలర్ మల్లం అనిల్, ఐకేపీ సిబ్బంది లావణ్య పాల్గొన్నారు.
గంగారం, సెప్టెంబర్ 25: బతుకమ్మ వేడుకలను గ్రా మాల్లో మహిళలు ఘనంగాజరుపుకోవాలని ఎంపీపీ సువర్ణపాక సరోజన అన్నారు. ఆదివారం మండలంలోని మర్రిగూడెం అంగన్వాడీ కేంద్రంలో స్థానిక సర్పంచ్ మద్దెల సాంబయ్యతో కలిసి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ప్రభుత్వం మండలానికి 4,256 చీరలను పంపించిందని, అర్హులందరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యదర్శి ప్రతిమ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
నర్సింహులపేట: దేశంలో ఎక్కడా లేనివిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు అందజేస్తున్నదని ఎంపీపీ టేకుల సుశీల అన్నారు. మండలంలోని పెద్దనాగారం, గోపాతండా, అజ్మీరతండా, వ స్రంతండా జీపీల్లోని గ్రామాల్లో ఆయా సర్పంచులు మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు టేకుల యాదగిరెడ్డి, సర్పంచులు శంకర్, లక్ష్మి, నాయకి, వెంకటేశ్వర్లు, యాదలక్ష్మి, హోలి, సీతారాములు, వంశీనాయక్, లింగ్యానాయక్ ఉన్నారు.
కురవి: మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజ్) గ్రామంలో జడ్పీటీసీ బండి వెంకట్రెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలు అందజేశారు. కందికొండ, కాంపల్లిలో సర్పంచులు తోట శోభారాణి, రమేశ్ చీరలు పంపిణీ చేశారు. గుండ్రాతి మడుగులో సర్పంచ్ హరిప్రసాద్, కందికొండలో వీ పద్మ, కాంపల్లిలో సొసైటీ వైస్ చైర్మన్ శ్రీను, కే వెంకట్రెడ్డి, కార్యదర్శి రఘువీర్ పాల్గొన్నారు.
మరిపెడ : బతుకమ్మ సందర్భంగా ఆడబిడ్డలకు కానుకగా చీరలు అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనని జిల్లా స్టాండింగ్ కమిటీ చైర్మన్ తేజావత్ శారద అన్నారు. మండలంలోని తానంచర్లలో మహిళలకు చీరలు పంపిణీ చేసి మాట్లాడారు. మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభు త్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, శ్రీనివాస్, రఘు, సీహెచ్ ప్రభాకర్, ఎన్ కృష్ణ, ఏ రెడ్డి, ముకేశ్ పాల్గొన్నారు.