పర్వతగిరి, సెప్టెంబర్ 23 : సబ్బండ వర్గాల అభివృద్దే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని వర్ధన్నపేట క్యాంప్ కార్యాలయం, అనంతారం, గోపనపెల్లి, కొంకపాక, చౌటపెల్లి, హట్యతండాల్లో ఎంపీ పసునూరి దయాకర్తో కలిసి ఎమ్మెల్యే శుక్రవారం పర్యటించారు. 409మంది లబ్ధిదారులకు పింఛన్ గుర్తింపు కార్డులు, 3,716 మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. సుమారు రూ.3కోట్ల 50 లక్షలతో చేపట్టిన శ్మశాన వాటికలు, డంపింగ్ యార్డులు, పబ్లిక్ టాయిలెట్స్, పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లను ప్రారంభించారు. కొంకపాకలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. తెలంగాణ సంస్కృతికి ప్రతి బింబమైన బతుకమ్మ పండుగకు పేదింటి ఆడబిడ్డలు కొత్త చీర ధరించి సంబురాల్లో పాల్గొనాలనే సంకల్పంతో ప్రభుత్వం చీరలను పంపిణీ చేస్తున్నదన్నారు. హసన్పర్తి మండలానికి సంబంధించి 11 వేల 93 మందికి చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రూ.12 వేల కోట్లను పింఛన్ల రూపంలో ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని తెలిపారు. తెలంగాణలో ఆసరా పెన్షన్ల సం ఖ్య అరకోటికి చేరిందని, దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఈ స్థాయిలో పింఛన్లు ఇస్తున్న దాఖలా లు లేవన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు ఇస్తామని స్పష్టం చేశారు. వృద్ధాప్య పెన్షన్ వయసును 65 నుంచి 57 సంవత్సరాలకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 10 లక్ష ల మందికి లబ్ధి చేకూరినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కాగా, ఆయా గ్రామాల్లో టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజలు అరూరికి ఘన స్వాగతం పలికారు.
డప్పు చప్పుళ్లు, కోలాటాలు, బతుకమ్మలతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. కార్యక్రమంలో ఎంపీపీ కమల, జడ్పీటీసీ సింగ్లాల్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శాంతి రతన్రావు, ఏకాంతంగౌడ్, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, నాయకులు బోయినపెల్లి యుగేంధర్రావు, చింతపట్ల సోమేశ్వర్రావు, సర్పంచ్లు తౌటి దేవేందర్, పంజా మహేశ్, వర్కాల రమేశ్, ఉమారాజు, నీలమ్మ వెంకట్రామ్, ఎంపీటీసీలు సూర రమేశ్, కర్మిళ్ల మోహన్రావు, లావణ్య, ఉప సర్పంచ్లు సూర అశోక్, రంజిత్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు మనోజ్గౌడ్, గొర్రె దేవేందర్, వైస్ చైర్మన్ తక్కళ్లపల్లి మధుసూదన్రావు, ఎంపీడీవో చక్రాల సంతోష్ కుమార్, ఏపీవో సుశీల్కుమార్, సర్పంచ్ చింతపట్ల మాలతీరావు, ఎంపీటీసీ మాడ్గుల రాజు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సర్వర్, మండలాధ్యక్షుడు రంగు కుమార్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.