నర్సంపేట, సెప్టెంబర్ 23 : ఆడబిడ్డలకు బతుకమ్మ, దసరా పండుగ కానుకగా సీఎం కేసీఆర్ చీరలు అందిస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శుక్రవారం నర్సంపేటలోని 22వ వార్డులో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గ వ్యాప్తంగా లక్షకు పైగా చీరలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే అన్ని పండుగలకు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. నర్సంపేటలో అభివృద్ధి పనులు చురుగ్గా జరుగుతున్నాయని, పట్టణాన్ని తెలంగాణ ప్రాంతంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. నర్సంపేటకు బస్తీ దవాఖాన మంజూరు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజిని, కౌన్సిలర్లు వేముల సాంబయ్యగౌడ్, రాయిడి కీర్తి, దార్ల రమాదేవి, బానాల ఇందిర, కమిషనర్ నాయిని వెంకటస్వామి, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ గంప రాజేశ్వర్గౌడ్, పట్టణాధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, మండల శ్రీనివాస్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.