నమస్తే నెట్వర్క్: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలకు పెద్ద సంఖ్యలో సకల జనులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా గ్రామాల్లో సమైక్యతా ర్యాలీలు నిర్వహించారు. ఇందులో భాగంగా దుగ్గొండి మండలం గిర్నిబావిలో ఎంజేపీటీ గురుకులం విద్యార్థులు, అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలు చేతబూని ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, అధికారులు పాల్గొన్నారు.
అలాగే, మండలం నుంచి నర్సంపేటలో నిర్వహించిన సభకు భారీగా తరలివెళ్లారు. నర్సంపేట మండలంలోని 27 గ్రామాల నుంచి అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు నర్సంపేటకు తరలివెళ్లారు. తొలుత గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. నెక్కొండ మండలం అలంకానిపేట నుంచి సర్పంచ్ మాదాసు అనంతలక్ష్మీరవి ఆధ్వర్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో నర్సంపేటకు తరలివెళ్లారు. నర్సంపేటలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ సభకు నల్లబెల్లి మండలం నుంచి అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. జడ్పీ ఫ్లోర్లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ ఊడుగుల సునీతాప్రవీణ్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. నర్సంపేటలో నిర్వహించిన ర్యాలీలో ఖానాపురం మండలం నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
వరంగల్ అండర్రైల్వేగేట్ ప్రాంతంలోని పలు డివిజన్ల నుంచి అన్ని వర్గాల ప్రజలు దేశాయిపేట సీకేఎం కళాశాలలో జరిగిన సభకు తరలివెళ్లారు. కార్పొరేటర్లు పల్లం పద్మ, సిద్దం రాజు, మరుపల్ల రవి, పోశాల పద్మ, ఖిలావరంగల్ పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్ ఆధ్వర్యంలో నాయకులు తరలివెళ్లారు. పోచమ్మమైదాన్ సెంటర్ నుంచి సీకేఎం కళాశాల వరకు నిర్వహించిన ర్యాలీలో వరంగల్ 25, 26, 28, 33వ డివిజన్ నుంచి ప్రజలు పాల్గొన్నారు. కార్పొరేటర్లు బస్వరాజు శిరీషాశ్రీమాన్, బాలిన సురేశ్, గందె కల్పనా నవీన్, ముష్కమల్ల అరుణాసుధాకర్ ప్రజలను సభకు తరలించారు.
చెన్నారావుపేట మండలం నుంచి 1120 మహిళలు నర్సంపేటలో జరిగిన సభకు హాజరయ్యారు. మండల ప్రత్యేకాధికారి బాలకృష్ణ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. వర్ధన్నపేటలో జరిగిన సభకు పర్వతగిరి మండలం నుంచి సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, మహిళలు, యువకులు తరలివెళ్లారు. ఎంపీపీ కమల, సర్పంచ్ చింతపట్ల మాలతీ సోమేశ్వర్రావు, ఎంపీటీసీ రాజు, తదితరులు పాల్గొన్నారు. పరకాల నియోజకవర్గ కేంద్రంలో జరిగే వజ్రోత్సవ ర్యాలీకి సంగెం మండలంలోని అన్ని గ్రామాల నుంచి మహిళలు, టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లారు.
పరకాల నియోజకవర్గ కేంద్రంలో జరిగిన వజ్రోత్సవ వేడుకలకు గీసుగొండ మండలంలోని 21 గ్రామాలతోపాటు గ్రేటర్ వరంగల్ పరిధిలోని 15, 16వ డివిజన్ నుంచి ప్రజలు భారీగా తరలివెళ్లి సమైక్యతను చాటారు. ధర్మారంలో అంబేద్కర్ విగ్రహం, సీఎం కేసీఆర్ చిత్రపటానికి కార్పొరేటర్ సుంకరి మనీషా, గంగదేవిపల్లిలో సర్పంచ్ గోనె మల్లారెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
కాశీబుగ్గ 14వ డివిజన్ ఎనుమాముల బాలాజీనగర్ నుంచి వర్ధన్నపేట వరకు ర్యాలీగా టీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. డివిజన్ అధ్యక్షుడు ముడుసు నరసింహ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని కార్పొరేటర్ తూర్పాటి సులోచన జెండా ఊపి ప్రారంభించారు. అలాగే, కాశీబుగ్గ 18, 19, 20వ డివిజన్ నుంచి వరంగల్ దేశాయిపేటలోని సీకేఎం కళాశాల మైదానంలో జరిగిన సభకు టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. రాయపర్తి మండలం నుంచి పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో జరిగిన వేడుకలకు సబ్బండ వర్గాలు ప్రజలు భారీగా తరలివెళ్లారు.
ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ సురేందర్రావు, పార్టీ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్ సారథ్యంలో నాయకులు, ప్రజలు పాలకుర్తికి తరలివెళ్లారు. వరంగల్ సీకేఎం కాలేజీ మైదానంలో జరిగిన బహిరంగ సభకు 12 డివిజన్ నుంచి కార్పొరేటర్ కావటి కవితా రాజుయాదవ్, 13వ డివిజన్ నుంచి కార్పొరేటర్ సురేష్కుమార్ జోషి, 21 డివిజన్ నుంచి ఎండీ ఫుర్ఖాన్, 22వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ ఇన్చార్జి మావురపు గీతా విజయభాస్కర్రెడ్డి, 23వ డివిజన్ నుంచి మాజీ కార్పొరేటర్ యెలుగం లీలావతీ సత్యనారాయణ, నీల రాజ్కిశోర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బయల్దేరి వెళ్లారు.