రైతును రాజుగా చేయాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పంట పెట్టుబడి సాయాన్ని అందించి ఆదుకుంటున్నది. వానకాలం సాగుకు సమాయత్తమవుతున్న అన్నదాతకు జూన్ మొదటి వారం నుంచి రైతుబంధు అందించేందుకు కసరత్తు చేస్తున్నది. జిల్లాలో గత యాసంగిలో 1,62,966 మంది రైతులకు రూ. 201.06 కోట్ల సాయాన్ని అందించింది. ఈ వానకాలంలో కొత్తగా అర్హులైన రైతుల జాబితాను తయారు చేసే పనిలో వ్యవసాయ శాఖ నిమగ్నమైంది. పట్టాదార్ పాస్ పుస్తకం ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ఇప్పటికే నూతనంగా 27,600 రిజిస్ట్రేషన్లు చేసుకోగా, ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకున్న వారికి కూడా అవకాశం కల్పించింది.
జనగామ, మే 25(నమస్తే తెలంగాణ): వానకాలం సాగు ప్రారంభానికి ముందే రైతులకు జూన్ మొద టి వారం నుంచి ఎకరానికి రూ.5వేల పెట్టుబడి సాయం అందించేందుకు అధికార యంత్రాంగం చేపట్టిన కసరత్తు తుది దశకు చేరుకుంది. రైతుబంధు పథకం కింద రైతన్నల బ్యాంకు ఖాతాల్లో వారం పదిరోజుల్లో డబ్బులు జమకానున్నాయి. గత యాసంగిలో 1,62,966 మంది రైతులకు రూ.201.06 కోట్ల సాయం అందించింది.
గత ఏడాది కాలంగా ధరణి, ఫాం ట్యాండ్లో జిల్లాలో కొత్తగా 27,600 రిజిస్ట్రేషన్లు జరిగి తే. వాటిలో పట్టాదార్ పాస్ పుస్తకం పొంది రైతుబంధు కోసం ఎంఈవోల వద్ద దరఖాస్తు చేసుకున్న రైతులకు సైతం ఈసారి పెట్టుబడి సాయం అందనుంది. కొత్తగా నమోదు చేసుకున్న మిగిలిన రైతులకు కూడా డబ్బులు చెల్లించేందుకు వ్యవసాయ అధికారులు చర్యలు వేగవంతం చేశారు. టీఆర్ఎస్ ప్రభు త్వం రైతును రాజు చేయాలనే సంకల్పంతో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టింది. తొలుత ఏడాదికి రూ. 8 వేలు ఒక ఎకరాకు రెండు విడుతలుగా చెల్లించేలా నిర్ణయించి తర్వాత ఎకరానికి రూ.10వేలుగా పెంచారు.
తొలి విడుత ఎకరంలోపు, రెండో విడుత రెండున్నర ఎకరాలు, మూడో విడుత 5ఎకరాలు, నాలుగో విడుత ఆపై ఎకరాలు ఉన్న అందరు రైతులకు పెట్టుబడి సాయం ఖాతాల్లో జమ కానుంది. జిల్లాలో 2021 మే నుంచి ఇప్పటి వరకు జనగామ మండలంలో 3,904, బచ్చన్నపేటలో 2,750, నర్మెటలో 1,878, తరిగొప్పులలో 1,353, పాలకుర్తిలో 3,551, దేవరుప్పులలో 2,096, కొడకండ్లలో 63, స్టేషన్ఘన్పూర్లో 2,649, చిల్పూరులో 1,591, రఘునాథపల్లిలో 2,450, లింగాలఘనపురంలో 3,300, జఫర్గడ్లో 2,015 రిజిస్ట్రేషన్లు జరిగాయి.
ఇప్పటికే ఆరు సీజన్లకు రైతుబంధు పెట్టుబడి సాయం అందించిన రాష్ట్ర ప్రభుత్వం కరోనా కారణంగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మరోసారి ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు రెడీ అయింది. దీంతో నార్లు పోసుకొని పొలాలను సిద్ధం చేసుకుంటున్న అన్నదాతల్లో హుషారు నెలకొంది. ధరణి పోర్టల్ లో నమోదైన రైతుల వివరాల ఆధారంగా వ్యవసాయశాఖ రైతుబంధు విడుదల చేస్తుండగా, కొత్త దరఖా స్తులకు ఈ నెల 31 వరకు గడువుగా పేర్కొని వారికి కూడా సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. కట్ ఆఫ్ డేట్లోగా ఆయా మండలాల పరిధిలోని వ్యవసాయ అధికారుల వద్ద పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్కార్డు, బ్యాంకు ఖాతా బుక్కు అందించి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
కొత్తగా పట్టాదార్ పాసుపుస్తకం వచ్చిన రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఏఈవోలు పరిశీలిం చి వారి పేర్లను ఆన్లైన్లో నమోదు చేస్తాం. రైతుబంధు పథకంలో లబ్ధిదారుడిగా ఉండి చనిపోయిన వారిని కూడా తొలగించి వారి స్థానంలో కొత్తగా నమోదైన పేర్లను చేరుస్తాం. రైతుబంధు సాయానికి కొత్తగా దరఖాస్తులు చేసుకున్నవి ప్రభుత్వానికి పంపించిన తర్వాత అక్కడ తుది పరిశీలన చేసి జాబితాను జిల్లాకు పంపిస్తారు. గతేడాది వానకాలం సీజన్ కంటే ఈసారి రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది. దానికి అనుగు ణంగా పాత రైతులు సహా కొత్త పాసు పుస్తకాలు పొందిన వారికి ఈసారి రైతుబంధు వర్తించనుంది.
– వినోద్కుమార్, జిల్లా వ్యవసాయాధికారి