మహబూబాబాద్ రూరల్, మే 25 : పట్టణ కేంద్రంలోని గురువారం హనుమాన్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వహిందు పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలోని హనుమాన్ ఆలయం నుంచి పాత బజార్ వరకు భక్తులు ర్యాలీ తీస్తూ, నృ త్యాలు చేశారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని, పాడి పంటలు సంమృద్ధిగా పండాలని వేడుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.
తొర్రూరు: డివిజన్ కేంద్రంలోని పాటిమీద ఆంజనేయస్వామి ఆల యంలో బుధవారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జాము నుంచే స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు రేణుకుంట్ల శివశర్మ పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తూర్పాటి చిన్న అంజ య్య, మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, ఆర్బీఎస్ జిల్లా కార్యవర్గ సభ్యుడు కిశోర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, పట్టణ అధ్యక్షుడు రామిని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ కర్నె సోమయ్య ప్రత్యేక పూజలు చేశారు. కల్లూరి ప్రకాశ్చ, రాధాకృష్ణ, దేవరకొండ కృష్ణప్రసాద్, ప్రదీప్, నరేందర్ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్త భజన మండలి ప్రతినిధులు కల్లూరి నాగేంద్రాచారి, గోపారపు నాగేశ్వర్రావు, దార నాగశివప్రసాద్, పీ యాకాంతాచారి పాల్గొన్నారు.
కురవి: మండలంలోని గుండ్రాతి మడుగు(విలేజ్)లో ని శివ రామాంజనేయస్వామి ఆలయంలో పూజారి రంగాభట్టార్ హనుమాన్ జయంతి సందర్భంగా చందనం, ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. సొసైటీ చైర్మన్ గార్లపాటి వెంకట్రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అన్నదానం చేశారు.
డోర్నకల్: మండలంలోని పలు గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
నర్సింహులపేట: మండల కేంద్రంతో పాటు కొమ్ములవంచ, పెద్దనాగారం, జయపురం వివిధ గ్రామాల్లో హన్మాన్ జయంతి బుధవారం ఘనంగా నిర్వహించారు. హన్మాన్ మాలదారులు, భక్తులు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.
మరిపెడ: హనుమాన్ జయంతి మున్సిపల్ కేంద్రంతో పాటు మండలంలోని బీచురాజుపల్లి, పురుషోత్తమాయగూడెం, ఎల్లంపేట, తానంచర్ల, రాంపూరం, ఎల్లంపేట, ఎర్జర్ల, తండధర్మారం తదితర గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కేంద్రంలోని శ్రీ సీతారామాంజనేయ ఆలయంలో 41 సార్లు సామూహీక హనుమాన్ చాలీసా పారాయణం, స్వామివారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహా అన్నదానం చేశారు. మరిపెడలో అభయాంజనేయ ఆలయంలో టీఆర్ఎస్ నేత గంట్ల మహిపాల్ రెడ్డి నేతృత్వంలో యువత మరిపెడ నుంచి పట్టణ కేంద్రానికి భారీ బైక్ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ గుడిపూడి నవీన్రావు, రామడుగు అచ్చుత్రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ కుడితి మహేందర్ రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యడు తాళ్లపల్లి శ్రీనివాస్, డాక్టర్ రవి, గందసిరి క్రిష్ణ, బొనగిరి సత్యనారయణ, వుల్లి శ్రీనివాస్, కాంతరావు, వెర్మరెడ్డి నర్సింహరెడ్డి, కుడితి నరసింహారెడ్డి, దేవరశెట్టి లక్ష్మీనారయణ, రఘురాం శర్మ, అభినవ్రెడ్డి, మధు పాల్గొన్నారు.
పెద్దవంగర: మండలంలోని గంట్లకుంటలో హనుమా న్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. హనుమాన్ దీక్షాపరులు ఇరుముడితో కొండగట్టుకు బయలు దేరారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ భక్తులు ఈరెంటి శ్రీనివాస్, నాగేశ్వర్రావు, జంపన్న, బోడ్యానాయక్, బాలు, సోమన్న, శ్రీను, కన్నె సంతోశ్, కుమార్, బాలరాజు, యాకయ్య, శ్రీకాంత్, రఘు, సందీప్, వెంకన్న, హరిబాబు, తదితరులు పాల్గొన్నారు.
గూడూరు: హనుమాన్ జయంతి సందర్భంగా మం డల కేంద్రంలో హనుమాన్ దీక్షాపరులు బుధవారం ఘనంగా నిర్వహించారు. స్వాములు మేర్గు మల్లయ్య, భాస్కర్, శ్రీపాల్రెడ్డి తదిరతులు పాల్గొన్నారు.
కేసముద్రం: మండలంలోని కల్వల గ్రామంలో భక్త ఆంజనేయ స్వామి కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. తాళ్లపూసపల్లి గ్రామంలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో, ఉప్పరపల్లిలో సీతారామచంద్రస్వామి ఆలయంలోచ మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడు కలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రావుల విజితారవిచందర్రెడ్డి, భక్తులు గంట బాలకృష్ణారెడ్డి, గం ట రామ్మోహన్రెడ్డి, ఆకుల సుధాకర్, సామల దిలీప్, మామిడాల శ్రీనివాస్, వెంకటరామనర్సయ్య, మూల వెంకట్రెడ్డి, గొర్రె వెంకన్న, బండి మల్లేశ్ ఉన్నారు.