దామెర, మే 24: సమైక్య పాలనలో రాత్రి వేళల్లో గ్రా మాలకు వెళ్లాలంటే ఒళ్లు జలధరించేంది.. చిమ్మని చీకట్లో ఇంటి నుంచి బయటికు రావాలన్నా.. సమీప గ్రామాలకు వెళ్లాలన్నా.. పాములు, తేళ్లు తదితర విషపురుగులతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవించేవారు. కానీ స్వరాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదు. పట్టణాలకు తీసిపోకుండా గ్రామాలు సైతం అభివృద్ధి చెందుతున్నాయి.
దామెర, ల్యాదెళ్ల, కోగిల్వాయి, పసరగొండ, పులుకూర్తి, దమ్మన్నపేట, సీతారాంపురం, తక్కళ్లపహాడ్, ముస్త్యాలపల్లి తదితర గ్రామాల్లో ఉమ్మడి పాలనలో ఎక్కడో ఒకచోట విద్యుత్ స్తంభానికి ఉండే చిన్న బల్బు కింద కొంత వెలుతురుండేది. ఎక్కువ శాతం విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరాయి. దీంతో ప్రతి వీధిలో చిమ్మని చీకటితో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తున్నారు.
అందులో భాగంగా ప్రతి పల్లెకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంతోపాటు, గల్లిగల్లిలో విద్యుత్ దీపాలను అమర్చేవిధంగా చర్యలు తీసుకున్నారు. ట్రాన్స్కో సిబ్బం ది నూతన స్తంభాలను ఏర్పాటు, ముఖ్య కూడళ్లలో సైతం హైమాస్ట్ లైట్లను అమర్చారు. ఫలితంగా పల్లెలు నేడు విద్యుత్ వెలుగుల్లో కాంతులీనుతున్నాయి. ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని చెబుతున్నారు.
ప్రతి వీధిలో విద్యుత్ స్తంభాలకు హైమాస్ట్ లైట్లను ఏర్పాటుతో సీఎం కేసీఆర్ మా జీవితాల్లో వెలుగులు నింపారు. గతంలో రాత్రి వేళల్లో బయటకు వెళ్లాలంటే పాములు, తే ళ్లు వంటి వాటితో తీవ్ర అవస్థలు ప డ్డాం. నేడు విద్యుత్ లైట్లు ఏర్పా టు చేయడంతో రాత్రి వేళల్లో జరిగే శుభకార్యాలకు వెళ్తున్నాం. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
-హింగె శ్రీనివాస్, ల్యాదెళ్ల
గతంలో మాగ్రామం చీకట్లో ఉండేది. దళిత కాలనీల్లో ఎక్కడో ఒకచోట విద్యుత్ స్తంభం, దారులన్నీ చీకట్లు కమ్మేవి. నేడు పరిస్థితి మారింది. టీఆర్ఎస్ హయాంలో వీధి పొడవునా హైమాస్ట్ లైట్లను అమర్చారు. నూతన విద్యుత్ పోల్స్ ఏర్పాటు చేశారు. మా కాలనీలో వెలుగులు విరజిమ్ముతున్నాయి. సీఎం కేసీఆర్ సార్కు, ఎమ్మెల్యే ధర్మారెడ్డికి కృతజ్ఞతలు.
-వేల్పుల ప్రసాద్, దామెర