మహబూబాబాద్, మే 24 : వర్షాకాలంలో రైతులు వేయబోయే పంటల నమోదు ప్రక్రియను మొదలుపెట్టాలని అధికారులను కలెక్టర్ కే శశాంక ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయం లో వానకాలం-2022 పంటల ప్రణాళికపై ఏవోలు, ఏఈవోలు, ఏడీఏలతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పంటల నమోదు, రైతువేదికలు, పంటల కొనుగోలు, విత్తనాలు, ఎరువులు పలు అంశాల విషయంలో అధికారులు అప్రమత్తంగా పని చేయాలన్నారు.
ఏఈవోలు పంటల నమో దు విషయంలో నిర్లక్ష్యం, అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతి 5 వేల ఎకరాలకు ఓ విస్తరణాధికారిని నియమించిందన్నారు. ప్రతి క్లస్టర్కు రైతువేదికను నిర్మించిందని, అక్క డి రైతులకు అందుబాటులో ఉంటూ నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చే యాలని ఆదేశించారు. ఈ నెల 31 వరకు ప్రతి క్లస్టర్లో రైతులందరికీ పీఎం కిసాన్ ఈ-కేవైసీ పూర్తి చేయాలన్నారు. సమీక్షా సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రునాయక్, డీఎస్హెచ్వో సూర్యనారాయణ, ఏడీఏ లక్ష్మీనారాయణ, శోభన్బాబు, రాజనరేందర్, టెక్నికల్ ఏవోలు స్వామి, సారయ్య, ఏవో తిరుపతిరెడ్డి, ఏఈవోలు పాల్గొన్నారు.
జిల్లాలో వివిధ పత్రికలు, టీవీ చానల్స్లో పనిచేసే మీడియా ప్రతినిధులు 2022-24 సంవత్సరానికి గాను అక్రిడిటేషన్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ కే శశాంక ఒక ప్రకటనలో సూచించారు. ఈ నెల 25 నుంచి జూన్ 4 తేదీ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో చేసుకోవాలని ఆయన సూచించారు.
జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కలెక్టర్ శశాంక అన్నారు. కురవి రోడ్డులోని ఈవీఎం గోదాంను నెలవారీ తనిఖీల్లో భాగంగా అదనపు కలెక్టర్ అభిలాషా అభినవ్తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదాంను ఎప్పటికీ సీసీ కెమెరాల నిఘాలో ఉంచాలన్నారు. సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలన్నారు. కలెక్టర్ వెంట ఎలక్షన్ కమిషన్ సూపరింటెండెంట్ అనురాధాబాయి, ఎలక్షన్ డీటీ శ్యామ్, సిబ్బంది రంజిత్, డీఆర్డీవో సన్యాసయ్య, మున్సిపల్ డీఈ ఉపేందర్, ఏఈ సురేశ్, టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ ప్రవీణ్ ఉన్నారు.
జీవో 58కు సంబంధించిన దరఖాస్తులను కలెక్టర్ శశాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని కొంపల్లి గోపాల్రావు నగర్, మిలిటరీ కాలనీల్లోని సర్వే నెంబర్ 551లోని ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ కోసం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న క్రమంలో కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు. కాలనీవాసులతో మాట్లాడారు.
ఒక ప్రాంతంలో రెండు, మూడు బృందాలు పర్యటించి, వివరాలను సేకరిస్తారన్నారు. లబ్ధిదారులు సంబంధించిన అర్హత పత్రాలు దగ్గర ఉంచుకోవాలని సూచించారు. 2014 కంటే ముందు ఇళ్లు కట్టుకుని ఉన్న ప్రభుత్వ భూముల్లో అభ్యంతరం లేని వాటిని మాత్రమే క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్సారథి, డీహెచ్ఎస్వో సూర్యనారాయణ, తహసీల్దార్ నాగభవాని, కేసముద్రం, బయ్యారం డిప్యూటీ తహసీల్దార్లు కోమలి, రవి, ఆర్డీవో కార్యాలయ పరిపాలన అధికారి సాంబశివుడు, సర్వేయర్లు తిరుమల్, నవీన్ పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని ప్రజ్ఞా సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్లు అభిలాషా అభినవ్, ఎం డేవిడ్, ఏఎస్పీ యోగేశ్గౌతమ్తో కలిసి రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేడుకలను ఎన్టీఆర్ స్టేడియంలో ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు.
కార్యక్రమానికి మంత్రి సత్యవతిరాథోడ్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. మినిట్ టు మినిట్ కార్యక్రమం తయారు చేయాలని సూచించారు. వివిధ శాఖల స్టాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రజాప్రతినిధులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానపత్రికలు అందేలా చూడాలన్నారు. సాయం త్రం కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో కలెక్టరేట్ పరిపాలనా అధికారి వెంకటరమణ, పర్యవేక్షకులు అనురాధ, పుల్లారావు పాల్గొన్నారు.