కాటారం, మే 24 : జనం మది నిండా గులాబీ జెండానే ఉన్నదని, అందుకే ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు మొ గ్గు చూపుతున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. మండలంలోని కాంగ్రెస్ నా యకులు హైదరాబాద్లోని పుట్ట మధు నివాసంలో మంగళవారం టీఆర్ఎస్ పార్టీలో చేరా రు. భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షిణీ రాకేశ్ ఆధ్వర్యంలో మేడిపల్లి సర్పంచ్ (ఇన్ఛార్జి) చింతల సుధాకర్, వార్డు సభ్యులు చింతల వినోద, కాంగ్రెస్ మహిళా గ్రామ శాఖ అధ్యక్షురాలు లక్ష్మి, యూత్ అధ్యక్షులు మారవేని లక్ష్మ ణ్, సదానందం, శ్రీను, రాజేందర్, మహిళలు కిష్టమ్మ, శంకరక్క, పోచక్కతోపాటు సుమారు 30 మంది గులాబీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ దేశంలో మరే జాతీయ పార్టీ కూడా అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో టీఆర్ఎస్ అమలు చే స్తున్నదన్నారు. రాబోయే రోజుల్లో దేశంలో సీఎం కేసీఆర్ చరిత్ర సృష్టించబోతున్నారని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పా ర్టీల దుకాణాలు పూర్తిగా బంద్ చేసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలను చూసి జీర్ణించుకోలేని జాతీయ పార్టీల నా యకులు ఎన్ని అసత్యపు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు జక్కు రాకేశ్, పీఏసీఎస్ చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి, శ్రీనివాస్, రామకృష్ణ, స్వరూప, మోహన్ రాజ్, జక్కు శ్రవణ్, దుర్కి కుమార్ పాల్గొన్నారు.