జిల్లాలో వానకాలం పంటల సాగుకు వ్యవసాయశాఖ సన్నద్ధమైంది. రైతులు సాగు చేయనున్న పంటల విస్తీర్ణంపై అంచనాలు రూపొందించింది. ఈ మేరకు అవసరమైన విత్తనాలు, ఎరువులను అందుబాటులోకి తెచ్చే పనిలో నిమగ్నమైంది. అలాగే, సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరుగనుంది. గతేడాది వానకాలంలో 4.51 లక్షల ఎకరాల్లో పంటలను సాగు చేయగా, ఈసారి 4.60 లక్షలకు చేరనుంది. ఈ సీజన్ లో 8,768 ఎకరాల్లో అదనపు సాగు కానుంది. గత సంవత్సరం 73,572 ఎకరాల్లో పత్తి వేయగా, ఇప్పడు 1,40,600 ఎకరాల్లో సాగు చేసేందుకు రైతాంగం సిద్ధమవుతోంది. ఈ ఏడాది పత్తి సాగు విస్తీర్ణం పెరుగనుండగా, వరి, మక్కజొన్న, మిర్చి సాగు తగ్గనున్నట్లు తెలుస్తోంది.
మహబూబాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): వానకాలం పంట ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. 2021 వానకాలంలో 4,51,812 ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ఈ ఏ డాది 4,60,580 ఎకరాల్లో వేయనున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది 8,768 ఎకరాల్లో అదనపు సాగు కా నుంది. ప్రతి ఏటా వానకాలం, యాసంగి పంటల సా గుకు ముందే అధికారులు జిల్లావ్యాప్తంగా ఏ పంట ఎంత సాగవుతుందో ముందే అంచనా వేసి ప్రణాళిక ను ఖరారు చేస్తారు. అధికారులు అంచనా వేసిన వాటి లో కొన్ని పంటల సాగు ఎక్కువ, మరికొన్ని తక్కువ స్థాయిలో రైతులు సాగు చేస్తారు.
గతేడాది వానకా లంలో సాగైన పంటల వివరాలు ఇలా ఉన్నాయి. వరి 2,14,342 ఎకరాలు, పత్తి-73,572, మక్కజొన్న-54,239, కంది-4,921, పెసర-4,509, వేరుశన గ-240, మిర్చి-82,760, పసుపు-4,401, ఇతర పంటలు 12,828 ఎకరాలు, మొత్తం 4,51,812 ఎకరాల్లో సాగు చేశారు. ఈ ఏడాది వానకాలం పంట ను అధికారులు ఖరారు చేశారు. ఇందులో వరి 1,80, 200 ఎకరాలు, పత్తి-1,40,600, మక్కజొన్న- 32, 630, కంది-12,036, పెసర-8,284, వేరుశనగ-610, మిర్చి-65,200, పసుపు-4,620, ఇతర పంటలు -16,400, మొత్తం అన్ని పంటలు కలిపి 4,60,580 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు పంట ప్రణా ళికను ఖరారు చేశారు. గతేడాది వానకాలం పంటతో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 8,768 ఎకరాల్లో అద నంగా సాగవుతుందని అంచనా వేశారు. ఇందుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు తెప్పించే పనిలో నిమ గ్నమయ్యారు.
జిల్లాలో ఏ పంటను ఎంత సాగు చేస్తారో గుర్తించిన వ్యవసాయ శాఖ అధికారులు అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులను తెప్పించి సిద్ధంగా ఉంచాలని భావించారు. ఇందులో భాగంగా వానకాలం సాగుకు వరి 54,100 క్వింటాళ్లు, పత్తి 261 క్వింటాళ్లు, మక్క జొన్న 2,81,200 ప్యాకెట్లు, కంది-610 క్వింటాళ్లు, పెసర-332 క్వింటాళ్లు, వేరుశనగ-482 క్వింటాళ్లు, మిర్చి-65 క్వింటాళ్లు, పసుపు-4,800 క్వింటాళ్లు, ఇతర విత్తనాలు కావాలని అధికారులు అంచనా వేశా రు.
వర్షాలు పడేలోపు అన్ని రకాల విత్తనాలను రైతుల కు అందుబాటులో ఉంచేలా ప్రణాళిక సిద్ధం చేశారు. అదేవిదంగా పంటలకు కావాల్సిన ఎరువులను కూడా అంచనా వేశారు. యూరియా 69,087 మెట్రిక్ టన్ను లు, డీఏపీ-23,030, కాంప్లెక్స్-46, 060, పొటాష్- 23,030 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమని ప్రణాళికలు రూపొందించారు.
జిల్లాలో వానకాలం పంట ప్రణాళికను సిద్ధం చేశాం. గతేడాది వానకాలం 4,51,812 ఎకరా ల్లో సాగు అంచనా వేయగా, ఈ ఏడాది 4,60, 580 ఎకరాల్లో సాగవుతుందని అంచానా వేశాం. అందుకనుగుణంగా విత్తనాలు, ఎరువులు కూడా తెప్పిస్తున్నాం. వర్షాలు పడేలోగా రైతులకు కావా ల్సిన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు పూర్తి స్థా యిలో అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తు న్నాం. ఫర్టిలైజర్ నిర్వాహకులతో ఇప్పటికే సమా వేశం నిర్వహించాం.
– ఛత్రూనాయక్, జిల్లా వ్యవసాయ అధికారి