జనగామ, మే 18 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో ప్రగతిపథంలో దూసుకెళ్తున్న తెలంగాణకు కేంద్ర నిధులు, ప్రాజెక్టులు సాధించలేని బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై అర్థరహిత విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మండిపడ్డారు. బుధవారం జనగామలోని క్యాంపు కార్యాలయంలో జనగామ మున్సిపాలిటీ, రూరల్, నర్మెట, తరిగొప్పుల మండలాలకు చెందిన 293 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు రూ.2,93,34,304 విలువైన చెక్కులు అందజేశారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత విద్వేషాలను సృష్టిస్తూ ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దె దించడం ఖాయమన్నారు. పన్నుల రూపంలో కేంద్రానికి రూ.3.65 లక్షల కోట్లు ఇచ్చిన తెలంగాణకు తిరిగి ఇచ్చింది కేవలం రూ.1.65 లక్షల కోట్లు మాత్రమేనన్నారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకొని పరిపాలిస్తుంటే సీఎం కేసీఆర్ శ్రమను నమ్ముకొని ప్రజాపాలన సాగిస్తున్నారని చెప్పారు. ఒక్క జనగామ నియోజకవర్గంలోనే కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఇప్పటి వరకు రూ.100కోట్ల ఆర్థికసాయం అందించామని చెప్పారు.
తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తప్పని నిరూపిస్తే నాతో పాటు 132 మంది నియోజకవర్గ ప్రజాప్రతినిధులం రాజీనామా చేస్తామని, తొండి (బండి) సంజయ్, ఎలిసిపోయిన రేవంత్రెడ్డికి దమ్ముంటే పదవులకు రాజీనామా చేస్తారా? అంటూ సవాల్ విసిరారు. ప్రజలకు సేవ చేయడమంటే తుపాకీ రాముడు లెక్క మాట్లాడడం కాదన్నారు. ఒకప్పుడు చుక్కనీరందక బీడుగా మారిన భూములు, బిందెడు నీళ్ల కోసం అల్లాడిన జనగామ గడ్డ ఇప్పుడు పచ్చటి కోనసీమ అయ్యిందన్నారు. దిగువ నుంచి ఎగువకు గోదావరి జలాలను మళ్లించి జనగామ ప్రాంత బీడు భూములను పచ్చగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేన ని, తెలంగాణ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అన్నా ప్రజలు ఊరుకోరు ఖబడ్దార్ అని ముత్తిరెడ్డి హెచ్చరించారు.
కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఇతర బీజేపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశంలో 80శాతం ఉన్న రైతులను బీజేపీ, కాంగ్రెస్ ఏనాడు పట్టించుకోలేదన్నారు. ఇక్కడ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను దమ్ముంటే బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలు చేయగలరా? అని సవా ల్ చేశారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బాల్దె విజయ, జనగా మ, నర్మెట జడ్పీటీసీలు నిమ్మతి దీపిక, మాలోత్ శ్రీనివాస్, నర్మెట ఎంపీపీ తేజవత్ గోవర్ధన్, తరిగొప్పుల, నర్మెట మండల టీఆర్ఎస్ అధ్యక్షులు పింగిళి జగన్మోహన్రెడ్డి, గౌస్, టీఆర్ఎస్ పట్ట ణ, మండలాధ్యక్షులు తాళ్ల సురేశ్రెడ్డి, యాదగిరిగౌడ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు ప్రమోద్రెడ్డి, మహిళా అధ్యక్షురాలు చెంచారపు పల్లవి, కౌన్సిల ర్లు ఎండీ సమద్, స్వరూప, బండ పద్మ, గాడిపెల్లి ప్రేమలతారెడ్డి, ఎం పాండు, టీఆర్ఎస్ నాయకు లు జూకంటి శ్రీశైలం, నీల యాదగిరి, ఎం రాజు, గుర్రం నాగరాజు, బక్క లక్ష్మణ్, దేవునూరి సతీశ్, తిప్పారపు ఆనంద్, లెనిన్ పాల్గొన్నారు.