కృష్నకాలనీ, ఆగస్టు19: జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణమందిరంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు మేకల సంపత్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శు క్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజరి రాఘవేంద్ర స్వామి శ్రీకృష్ణుడికి జన్మదిన పూజలు నిర్వహించగా, జిల్లా కేం ద్రంలోని యాదవ కులస్తులు కుటుంబ సభ్యులతో కలిసి యాదవ సాంప్రదాయ పద్ధ్దతిలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూ జలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ప్రాగణంలో యాదవ బాలలతో ఉట్టిని కొట్టించారు. అనంతరం యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు మేకల సంపత్ కుమా ర్ యాదవ్, తమ కులస్తులతో కలిసి కృష్ణకాలనీ నుంచి అంబేద్కర్ క్రీడా మైదానం వరకు శ్రీకృష్ణ, గోపికల విగ్రహాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సై ఇస్లావత్ నరేశ్ ముఖ్య అతిథిగా హాజరై ఉట్టికొట్టె కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై నరేశ్ మాట్లాడుతూ యాదవ కులస్తులంతా శ్రీకృష్ణష్టామి రోజు న ఒక్క దగ్గరకు చేరుకుని కృష్ణునికి పూజలు చెల్లించడం సంతోషకరమన్నారు.
శ్రీకృష్ణ జన్మాష్టామిని పురస్కరించుకుని అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉట్టికొట్ట్టే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కేంద్రంలోని యువతీయువకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వీరిలో యాదవ కాలనీకి చెందిన అల్లం కల్యాణ్ వ్యక్తి ఉట్టికొట్ది విజయం సాధించడంతో విజేత కల్యాణ్కు అఖిల భారత యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు సంపత్ కుమార్ బహుమాతిగా రూ. 5,016 అందజేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండ్ర హరీశ్ రెడ్డి, కౌన్సిలర్లు ఎడ్ల మౌనిక శ్రీనివాస్, హరీకా శ్రీనివాస్, మంజంపెల్లి మురళీధర్, సజ్జనపు స్వామి, యాదవ సంఘం నాయకులు జగరి అజయ్ యాదవ్, సింగనవేణి చిరంజీవి, నలిగేటి సతీశ్ కుమార్, అప్పం కిషన్, పీ సదానందం, శ్రీనివాస్, పీ అశోక్, పీ ప్రసాద్ పాల్గొన్నారు.
మంగపేట: మండలంలోని కమలాపురం రామాలయం, సాయిబాబా ఆలయం, మండల కేంద్రంలోని శ్రీవైష్ణవి పాఠశాలలో శుక్రవారం ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యువకులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
వాజేడు : మండలంలోని పేరూరు గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం స్థానిక యువకులు ఘనంగా నిర్వహించారు. గ్రామంలో యువకులంతా కలిసి ఉట్టికొట్టి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
టేకుమట్ల: మండలంలోని శ్రీకృష్ణ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న పిల్లలు శ్రీ కృష్ణుడి, గోపిక వేషధారణలతో పాఠశాలలకు వెళ్లారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించి, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఉపాధ్యాయులు హరీశ్కుమార్, నేరేళ్ల ఓం నారాయణ గౌడ్, కే నారాయణ, మధునయ్య, చైతన్య, గీత, ప్రశాంత్, కమల పాల్గొన్నారు.
మహదేవపూర్ : మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉత్సాహంగా ఉట్టికొట్టారు. ఎంపీపీ రాణీబాయి, జడ్పీటీసీ అరుణ పాల్గొన్నారు.
మహాముత్తారం: మండలంలోని ములుగుపల్లి పంచాయతీ పరిధిలోని డీ అంగన్వాడీ కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ములుగుపల్లి సర్పంచ్ దూలం మల్లయ్యగౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, చిన్నారులతో ఉట్టి కొట్టించారు. అంగన్వాడీ టీచర్లు ప్రమిళ, స్వప్న, రాజసమ్మక్క, లక్ష్మి పాల్గొన్నారు.
చిట్యాల: మండల కేంద్రంలోని కాకాతీయ హైస్కూల్లో, చల్లగరిగెలోని రైజింగ్సన్ హైస్కూల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. నైన్పాక, నవాబుపేట, శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో ఉట్టికొట్టి రంగులు చల్లుకుంటూ సంబురాలు నిర్వహించారు.
కాటారం: మండలకేంద్రంలో అఖిల భారత యాదవ సంఘం, శ్రీకృష్ణ యాదవ యూత్ ఆధ్వర్యంలో అభయాంజనేయస్వామి ఆలయం వద్ద, ఆదర్శ విద్యాలయంతో పాటు పలు విద్యా సంస్థల్లో శుక్రవారం నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకలు అలరించాయి. అఖిల భారత యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడి ఉత్సవ విగ్రహంతో శోభయాత్ర నిర్వహించారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించి, విజేతగా నిలిచిన తొట్ల శేఖర్ అనే వ్యక్తికి యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు సంపత్యాదవ్ చేతుల మీదుగా రూ. 5116 అందజేశారు. ఆదర్శలో చిన్నారులు గోపికలు, శ్రీకృష్ణుడి వేషధారణలతో ఆకట్టుకున్నాయి. ఉట్టి కొట్టె కార్యక్రమాల్లో చిన్నారులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నాయిని శ్రీనివాస్, యాదవ సంఘం మండలాధ్యక్షుడు చంద్రయ్య, యూత్ అధ్యక్షుడు దేవేందర్, నాయకులు బాపు, చందు, శ్రీశైలం, ఆదర్శ స్కూల్ చైర్మన్ జనగామ కరుణాకర్రావు, ప్రిన్సిపాల్ జనగామ కృషిత, ఉపాధ్యాయులు ఉన్నారు.