మహదేవపూర్, ఆగస్టు 9 : మహనీయుల పోరాట స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్, టీఆర్ఎస్ మంథని నియోజకవర్గ ఇన్చార్జి పుట్ట మధు అన్నారు. ప్రపం చ ఆదివాసీ దినోత్సవ వేడుకలు మంగళవారం మండలకేంద్రంలో నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై కుమ్రం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్చించారు. అనంతరం చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉద్యమ శిఖరం సమ్మయ్య దొర మృతి ఆదివాసీలకు తీరనిలోటన్నారు. కుమ్రంభీం ఆశయాలను కొనసాగించాలన్నారు. ఆ మ హనీయుడి చరిత్ర గిరిజనులు, ఆదివాసీలకు ఆనాడే తెలిసి ఉంటే మాడా విశ్రాంతి భవనం ముందు శ్రీపాదరావు విగ్రహం కాకుం డా కుమ్రంభీం విగ్రహం ఉండేదన్నారు.
కుల సంఘాలు రాజకీయాలకతీతంగా పనిచేయాలని, ప్రజల్లో చైతన్యం రాలేదనడానికి మాడా కార్యాలయమే నిదర్శమన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రాణీబాయి, టీఆర్ఎస్ జిల్లా యువజన నాయకుడు జక్కు రాకేశ్, సర్పంచ్ శ్రీపతిబాపు, ఏటీడీవో దేశిరాం నాయక్, ఆదివాసీ నాయకులు మడే కుమార్, రామయ్య, గుర్సింగ బాపు, పీఏసీఎస్ చైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్ రావు, పలిమెల అధ్యక్షుడు జవ్వాజి తిరుపతి, నియోజక వర్గ మహిళా విభాగం ఇన్చార్జి కేదారి గీత, మండల అధ్యక్షురాలు స్వప్న పాల్గొన్నారు.
వజ్రోత్పవాలను ప్రజలు ఘనంగా జరుపుకోవాలని పుట్ట మధు అన్నారు. మంగళవారం ఆయన ఎంపీడీవో కార్యాలయంలో స్థానికుల కు జాతీయ జెండాలు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెం డా ఎగరవేసి దేశభక్తిని చాటి చెప్పాలని కోరారు.