నర్సంపేట, ఆగస్టు 9 : భద్రాచలం నుంచి నారాయణ ఖేడ్కు ఎండు గంజాయిని రవాణా చేస్తుండగా నర్సంపేట పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఈస్ట్ జోన్ డీసీపీ వెం కటలక్ష్మి కథనం ప్రకారం.. ఎండు గంజాయిని తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు నర్సం పేట పాకాల రోడ్డులో పోలీసులు మంగళవారం వాహనాల తనిఖీ నిర్వహించారు. బొలెరో వాహనం, ఒక గూడ్స్ట్రాలీ వాహనంలో ఇద్దరు వ్యక్తులు కొత్తగూడ నుంచి నర్సంపేట వెళ్తున్నారు.
పారిపోతుండగా పోలీ సులు వెంబడించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. ఇద్దరిలో ఒకరు పారిపోయారు. వాహనంతో పాటు ఓ వ్యక్తి పోలీసులకు దొరికాడు. అతడిని పట్టుకుని విచారించారు. నారాయణఖేడ్ సిప్రి గ్రామానికి చెందిన వడ్త్యా హన్మనాయక్ ట్రాలీ డ్రైవర్గా పనిచేస్తున్నానని ఒప్పుకున్నాడు. తన స్నేహితుడు మారుతితో కలిసి భద్రాచలం సమీప గ్రామాల్లో గంజాయిని కొనుగోలు చేసుకుని తీసుకుని వస్తున్నామని అన్నారు. నారాయణ ఖేడ్లో ఎక్కువ ధరలకు విక్రయించేందుకు వెళ్తున్నట్లు తెలిపారు. బొలెరో వాహనాన్ని పరిశీలించగా 278 గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి.
రూ. 55,50,000 విలువైన సుమారు 550 కిలోలు గంజాయితోపాటు మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న వడ్త్యా హన్మనాయక్, మారుతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. ఇద్దరిపై గతంలో ఎలాంటి కేసులు లేవని చెప్పారు. వీరు ఎవరి వద్ద గంజాయి కొనుగోలు చేశారు, ఎవరికి విక్ర యిస్తున్నారనే సమాచారాన్ని సేకరిస్తున్నామని పేర్కొ న్నారు. కేసులో ప్రతిభ కనబర్చిన ఏసీపీ సంపత్రావు, సీఐ పులి రమేశ్, ఇన్స్పెక్టర్ సురేశ్, కానిస్టేబుళ్లు ఎండీ కలీముద్దీన్, కే సునీల్, కే రవిని డీసీపీ అభినందించారు.