గీసుగొండ, జూలై 26 : ఆన్లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని మామునూర్ ఏసీపీ నరేశ్కుమార్ తెలిపారు. మండలంలోని వంచనగిరి మోడల్ స్కూల్ విద్యార్థులకు రోడ్డు భద్రత, సైబర్ క్రైంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు రోడ్డు భద్రతపై ఆవగాహన పెంచుకోవాలని సూచించారు.
రోడ్డు దాటే క్రమంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తుజేశారు. ఆన్లైన్ మోసాలపై యువత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఆన్లైన్ మోసాలతో ఎంతో మంది నష్టపోతున్నట్లు ఆయన తెలిపారు. విద్యార్థులు రోడ్డు భద్రత, సైబర్ క్రైంపై తల్లిదండ్రులను చైతన్యం చేయాలని ఆయన సూచించారు. సీఐ రాయల వెంకటేశ్వర్లు, ఎస్సై వెంకన్న, ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
నర్సంపేట: సైబర్ నేరాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సీఐ పులి రమేశ్ సూచించారు. మంగళవారం నర్సంపేటలోని విస్డమ్ హైస్కూల్లో విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు సెల్ఫోన్లలో మెసేజ్లు, ఫోన్లు చేస్తూ అకౌంటు నంబర్లు, ఆధార్ నంబర్లు, పాన్కార్డులు, ఓటీపీ నంబర్లు చెప్పాలని కోరుతారని అన్నారు.
లక్కీ డ్రాలు తేలాయని, బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నామని, రుణాలు ఇస్తామంటూ,ఆఫర్లు ఉన్నాయని వినియోగదారులకు ఫోన్ చేసి, మోసం చేస్తున్నారని తెలిపారు. అలాంటప్పుడు వెంటనే పోలీసులకు 100 కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. రోడ్డు నిబంధనలు పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రవీందర్, పాఠశాల కరస్పాండెంట్ జహంగీర్ పాల్గొన్నారు.
పోచమ్మమైదాన్: వరంగల్ పోచమ్మమైదాన్ సెంటర్లో ఆటో డ్రైవర్లకు మంగళవారం ట్రాఫిక్ పోలీసులు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆటో డ్రైవర్లకు మోటర్ వాహన చట్టంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ బాలులాల్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలన్నారు. డ్రైవర్లు మద్యం తాగి ఆటోలు నడుపరాదన్నారు.
ప్రయాణికులపై మర్యాదగా వ్యవహరించాలన్నారు. రోడ్డు మార్గంలో ప్రతి చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయని, వీటి ద్వారా తాము ఆటో డ్రైవర్లు, ఇతర వాహనదారుల తీరు పరిశీలిస్తుంటామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ హెడ్కానిస్టేబుల్ కుమారస్వామి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.