పాలకుర్తి రూరల్, జూలై 1: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని, ఈ నేపథ్యంలో ఎంపీపీలకు చెక్ పవర్ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. జడ్పీ చైర్మన్తోపాటు ఎంపీపీలకు చెక్పవర్ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం మండల కేంద్రంలో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి చిత్ర పటాలకు జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్రావుతో పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ స్థానిక సంస్థలను బలోపేతం చేయాలన్నదే సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు లక్ష్యమన్నారు. ఎంపీపీలకు చెక్ పవర్ కల్పించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్కుమార్, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బల ఆశోక్రెడ్డి, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, వైస్ ఎంపీపీ దార శారదాశంకరయ్య, ఎంపీటీసీలు మాటూరి యాకయ్య, బానోత్ చత్రూ, పుస్కూరి కళింగరావు, మడిపెల్లి వేణు, కొడిశాల యాదగిరి, తాళ్ల సోమనారాయణ, చెరిపెల్లి విజయ్కుమార్, కడుదుల కరుణాకర్రెడ్డి, పోశాల వెంకన్న పాల్గొన్నారు.
దేవరుప్పుల : స్థానిక సంస్థలైన జిల్లా, మండల పరిషత్లలో జడ్పీ చైర్మన్, ఎంపీపీలకు చెక్ పవర్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంపై ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బస్వ సావిత్రి నేతృత్వంలో సీఎం కేసీఆర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలో ఎంపీపీలకు సముచిత స్థానం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
స్థానిక సంస్థల ను బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కత్తుల విజయ్కుమార్, ఎంపీటీసీలు పానుగంటి గిరి, బానోత్ యాఖూనాయక్, లావుడ్యా ఉపేందర్, గొడుగు సుజాత, దుబ్బాక కవిత, తోటకూరి రేణుక, మేడ కల్యాణి, గుగులోత్ ఆశాజ్యోతి, కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ మజర్ పాషా, ప్రజాప్రతినిధులు బస్వ మల్లేశ్, గొడుగు మల్లికార్జున్, దుబ్బాక రత్నాకర్రెడ్డి, తోటకూరి కిష్టయ్య, మేడ వెంకట్, వంగ వెంకన్న, ఆలకుంట్ల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.