మహబూబాబాద్, జూలై 1 : తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని యశోద గార్డెన్లో నిర్వహించిన లంబాడీ హక్కుల పోరాట సమితి 25వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బంజారాలు ఐకమత్యంతో కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
గత పాలకులు లంబాడీలను రాజకీయంగా వాడుకుని ఎదిగారని, ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. ‘మన తండాలో మన రాజ్యం’ అనే నినాదాన్ని నిజం చేసి, మన తండాలను మనమే పాలించుకునేలా సీఎం కేసీఆర్ గ్రామ పంచాయతీలు తీర్చిదిద్దారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్, ఎల్హెచ్పీఎస్ జాతీయ అధ్యక్షుడు బెల్లయ్యనాయక్, మాజీ ఎంపీ బలరాంనాయక్, జీసీసీ చైర్మన్ కోత్యానాయక్, అశోక్నాయక్, బోడ లక్ష్మణ్నాయక్, ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర, జిల్లా, మండలాల నాయకులు పాల్గొన్నారు.