తొర్రూరు, జూలై 1: ఆరోగ్యకర సమాజ నిర్మాణం కోసం వైద్యులు నిరంతరం శ్రమిస్తుంటారని, కనిపించే దైవాలుగా సమాజం డాక్టర్లను కొలుస్తుందని, బాధ్యతగా పని చేసిన ప్రతి వైద్యున్ని ప్రజలు ఎప్పుడు మరిచిపోరని డిప్యూటీ డీఎం హెచ్వో గుండాల మురళీధర్ తెలిపారు. డాక్టర్స్ డే సంద ర్భంగా శుక్రవారం లయన్స్ క్లబ్ ఆఫ్ తొర్రూరు సేవా తరుణి ఆధ్వర్యంలో డివిజన్ కేంద్రంలోని సాంఘిక్ష సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో నిర్వహించిన విద్యార్థులకు ప్రత్యేక వైద్య శిబిరం, వైద్యులకు సన్మాన కార్య క్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
సమాజంలో మంచి పేరుతో పూజింపబడే వైద్యులు రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తారని, ఏ డాక్టర్ కూడా రోగి ప్రాణాలను ఎంతో అమూల్యంగా భావి స్తారన్నారు. కరోనా సమయంలో ప్రాణాల కు తెగించి ప్రపం చ వ్యాప్తంగా వైద్యులు నిద్రాహారాలు మాని అందించిన సేవలకు కోట్లాది మంది ప్రాణాలు కాపాడగలిగారని ఈసేవ లో కొంత మంది వైద్యులు తమ విలువైన ప్రాణాలను కూడా కోల్పోయారని చెప్పారు. లయన్స్ క్లబ్ సేవా తరుణి వారు వైద్యులను సన్మానించి బాధ్యతను మరింత పెంచారని, ఇలాంటి సంస్థలు ప్రజల కోసం పని చేసే వారిని గుర్తించి ఆదరిస్తే రెట్టింపు ఉత్సాహంతో విధి నిర్వహణ లో ముందుకు వెళ్తారని చెప్పారు.
సోషల్వెల్ఫేర్ కళాశాల విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచి స్తూ వైద్య వృత్తి ప్రాముఖ్యతను, బా ధ్యతాయుతంగా వైద్య సేవలు అందించే వారికి సమాజంలో వచ్చే గుర్తింపు ఎలా ఉంటుందన్న విషయంపై పలువురు వైద్యులు వివరించారు. క్లబ్ అధ్యక్షురాలు వజినపల్లి దీప అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్వో మురళీధర్తో పాటు తొర్రూరుకు చెందిన ప్రముఖ ప్రైవేట్ వైద్యుడు కే యాదగి రిరెడ్డి, డాక్టర్ ఎస్ రాంనర్సయ్య, డాక్టర్ పీ కిరణ్కుమార్, డాక్టర్ మిథాలి, తొర్రూరు, నెల్లికుదురు, దంతాలపల్లి ప్రభు త్వ దవాఖాన మెడికల్ ఆఫీసర్లు మీరాజ్, డాక్టర్లు శ్రవణ్, డాక్టర్ వేదకిరణ్, రేణుక, భార్గవ్, అజయ్, చందనలను ఘనంగా సన్మానించారు.
వీరితో పాటు ఇంటర్ మీడియట్ ఎంపీసీ, బైపీసీ ప్రథమ సంవత్సరంలో ఉత్తమ మార్కులు సాధించిన ఇద్దరు విద్యార్థులను సన్మానించారు. ఈ కార్య క్రమంలో సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ఎస్ నాగవాణి, లయన్స్ రీజియన్ చైర్మన్ రేగూరి వెంకన్న, జోన్ చైర్మన్ ప్రతాపని వెంకటేశ్వర్లు, సోషల్వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్ జయశ్రీ, క్లబ్ ప్రధాన కార్యదర్శి వజినపల్లి శైలజ, కోశాధి కారి చీదర నీలిమ, రేగూరి శ్రీదేవి, కూన పద్మావతి, పెరుమాండ్ల స్వాతి, వన మాల మాధవి తదితరులు పాల్గొన్నారు.
చిన్నగూడూరు: మండలంలోని ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది డాక్టర్స్డేను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీహెచ్సీలో కేక్కట్ చేసి వైద్యాధికారి రవికుమార్ను పీహెచ్సీ సిబ్బంది ఘ నంగా శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ పురుషోత్తం, సూపర్వైజర్ రాధాకుమారి, స్టాఫ్నర్సు మాదవి, ఏఎన్ఎం నర్సుబాయి, శ్యామల, వనిత, శ్రీవాణి, భారతి, హెల్త్ అసిస్టెంట్ ధర్మేందర్, వీరయ్య, సిబ్బంది జ్యోతి, అనిత, సైదమ్మ, కళావతి, కల్పన ఉన్నారు.