– సమగ్ర ఓటర్ల నమోదును సద్వినియోగం చేసుకోండి
– తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య
కోదాడ, జూలై 25 : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రతి పౌరుడికి అత్యంత శక్తివంతమైన వజ్రాయుధం వంటిదని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. శనివారం తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణం పెరిక హాస్టల్ ప్రాంగణంలో నిర్వహించిన పెరిక కులస్తుల ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓట్ల నమోదు, తొలగింపుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా పెరిక కుల బిడ్డలు వెంటనే ఫారాలు నింపి బీఎల్వో లకు అందించి ఓటు హక్కు నమోదు చేసుకోవాలని కోరారు.
ప్రజాస్వామిక దేశంలో ఓటే మన గుర్తింపు అని, సంక్షేమ పథకాల లబ్ధికి కూడా ఇది ఎంతగానో ముడిపడి ఉంటుందన్నారు. అనంతరం దేశ, విదేశాల్లో క్రీడల్లో సత్తా చాటిన కిత శ్రీనివాసరావుకు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కందుల కోటేశ్వరరావు, కందుల చంద్రశేఖర్, తెలంగాణ రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు, పెరిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పత్తిపాక జనార్ధన్, బత్తిని కృష్ణమూర్తి, నాళం రాజన్న, చిత్తలూరి సత్యనారాయణ, శివయ్య, రామినేని సత్యనారాయణ, పత్తిపాక కృష్ణ, అంకతి వెంకన్న, బరపాటి కోటేశ్వరరావు, బచ్చు అశోక్, దొంగరి శ్రీనివాస్, కితా శ్రీనివాసరావు, వనం నాగేశ్వరరావు, చిత్తలూరి శివలింగం పాల్గొన్నారు.