పెద్దవంగర, జూలై 1: ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలోనే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఇస్తున్నారని ఎంపీపీ ఈదురు రాజేశ్వరి పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చిత్ర పటాలకు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం ఎంపీపీ, జడ్పీ చైర్మన్లకు చెక్పవర్ను ఇవ్వడంతో గ్రామా లు మరింత అభివృద్ధి సాధించడం జరుగుతుందన్నారు.
చెక్ పవర్ అందించడంతో సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంఎల్సీలకు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఫోరం మండలాధ్యక్షుడు శ్రీనివాస్, ఎంపీటీసీలు కల్పనారాజుయాదవ్, అనురాధశ్రీనివాస్, సబితావెంకన్న, ఎంపీవో యాకయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఐలయ్య, మండల ప్రధాన కార్యదర్శి సంజయ్ టీఆర్ఎస్ నా యకులు ఆంజనేయులు, ఉపేందర్రెడ్డి, విజయ్పాల్రెడ్డి, రాము, వీరారెడ్డి, భిక్షపతి, ఉపేందర్, అంజయ్య, టీఆర్ఎస్ యూత్ నాయకులు హరీశ్యాదవ్, రామ్మూర్తి, యాకయ్య, అనుదీప్, చిరంజీవి, యాకన్న, ఉన్నారు.