పదో తరగతి పరీక్షల ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. జిల్లాలో 9,204మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 8,421 (91.4శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 4,561మందికి 4,101 (89.91 శాతం), బాలికలు 4,643 మందికి 4,320 మంది (93.1శాతం) ఉత్తీర్ణులయ్యారు. ప్రభుత్వ, మోడల్ స్కూళ్ల విద్యార్థులు సత్తాచాటారు. 22 పాఠశాలల్లో 100శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. ఏకంగా 18 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు. ఇక రాష్ట్రస్థాయిలో జిల్లా 20వ స్థానంలో నిలిచింది.
మహబూబాబాద్ రూరల్, జూన్ 30 : పదో తరగతి ఫలితాల్లో బాలికల హవా కొనసాగింది. ఎప్పటిలాగే ఈ ఏడాది ఫలితాల్లోనూ వారే ముందువరుసలో నిలిచారు. ప్రభుత్వ, మోడల్ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. మొత్తం 9,204 మంది విద్యార్థులకు గాను 8,421 మంది పాసయ్యారు. బాలురు 89.91 శాతం, బాలికలు 93.1 శాతం ఉత్తీర్ణతను సాధించారు. రాష్ట్రంలో జిల్లా 20వ స్థానంలో నిలిచింది. ఈసారి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో మంచి ఫలితాలు సాధించారు.
22 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణతను సాధించగా, 18 మంది విద్యార్థులు 10 జీపీఏ పొందారు. ఆదర్శ పాఠశాలలో 16 మంది, కేజీబీవీలో ఒకరు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒకరు 10 జీపీఏ సాధించారు. ఆదర్శ పాఠశాల విద్యార్థులు నలుగురు 10 జీపీఏ, ఏడుగురు 9.8 జీపీఏ సాధించారు. గుగులోత్ కావేరి, పొన్నం సింధు, గంగాధరి పూజ, బానోత్ సింధుకు 10 జీపీఏలు సాధించారు. భావ్యశ్రీ, భవాని, హిమబిందు, యామిని, సిద్ధార్థ, ప్రాన్సిస్, పూర్ణేశ్కు 9.8 జీపీఏ సాధించారు. 99 మందికి గాను 99 మంది పాసై, 61 మంది విద్యార్థులు 9 జీపీఏ సాధించారని, పాఠశాలలో 100 శాతం ఉత్తీర్ణులయ్యారని ప్రిన్సిపాల్ అమరావతి తెలిపారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది.
డోర్నకల్: పదో తరగతి ఫలితాల్లో చిలుకోడు మోడల్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు. బానోత్ వంశీ, కుందోజు వైష్టవి, సొలిటి భవ్యిశ్రీ, దాసరి అన్వితకు 10 జీపీఏ మార్కులు రాగా, 92 శాతం ఉత్తీర్ణత సాధించారు. ముల్కలపల్లి జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఈ మేఘన 9.7 జీపీఏ, 13.16శాతం ఉత్తీర్ణత సాధించారు. పెరుమాండ్ల సంకీస జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 63శాతం, జడ్పీహెచ్ఎస్ మన్నెగూడెం పాఠశాలలో ఎల్ రాధికకు 8.3 జీపీఏ రాగా, 53.17శాతం, డోర్నకల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో భూక్యా మహలక్ష్మి 9.7జీపీఏ సాధించగా, 59.01శాతం, చిలుకోడు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మహేశ్వరికి 8.8 జీపీఏ రాగా, 54శాతం, కన్నెగుండ్ల జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పీ కరుణకు 9.7 జీపీఏ రాగా, 67శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
గూడూరు: పదో తరగతి ఫలితాల్లో మండలంలోని విద్యారులు 92.6 ఉత్తీర్ణత సా ధించారని ఎం ఈవో శ్రీదేవి గురువారం తెలిపారు. మొత్తం 476 మం దికి గాను 441 మంది పాసయ్యారని, తీగలవేణి, గూడూరు బాలికల పాఠశాల, ఏహెచ్ఎస్ సీతానగరం పాఠశాల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. తీగలవేణిలో బీ నర్సింహ, గూడూరు బాలికల పాఠశాలలో జీ ఐశ్వర్య 9.8 జీపీఏ సాధించి మండల టాపర్లుగా నిలిచారన్నారు.
గార్ల: సీతంపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థి వీ సునీల్ మండల ప్రథమ ర్యాంకు సాధించగా, ఎంఈవో పూల్చంద్, హెచ్ఎం లోకేశ్ విద్యార్థిని అభినందించారు. ముల్కనూరు జడ్పీహెచ్ఎస్ పాఠశాల 41.38శాతం, జడ్పీహెచ్ఎస్ పెద్ద కిష్టాపురం 64.71శాతం, జడ్పీహెచ్ఎస్ మద్దివంచ 72.73 శాతం, జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల 64.1శాతం, జడ్పీహెచ్ఎస్ సీతంపేట 46.1శాతం, జడ్పీహెచ్ఎస్ గార్ల 71.43శాతం, జడ్పీహెచ్ఎస్ గోపాలపురం 85.71శాతం, జడ్పీహెచ్ఎస్ కొత్తపోచారం 72.22శాతం, జడ్పీహెచ్ఎస్ పుల్లూరు విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించారు.
నెల్లికుదురు: పదో తరగతి ఫలితాల్లో నెల్లికుదురు మండలంలోని విద్యార్థులు 97శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో గుగులోత్ రాము తెలిపారు. ఎమ్మార్సీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మొత్తం 464 విద్యార్థులకు గాను 452 మంది పాసైనట్లు తెలిపారు. నెల్లికుదురులోని మోడల్ స్కూల్లో పనికర అఖిల, మల్యాల సుమిత, లక్కాకుల రితిక 10/10 జీపీఏ సాధించినట్లు తెలిపారు. మునిగలవీడు, రాజులకొత్తపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 100శాతం, మోడల్ స్కూల్లో 99 శాతం, జడ్పీఎస్ఎస్ ఆలేరులో 98.21 శాతం, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 97.85 శాతం, జడ్పీఎస్ఎస్ చిన్నముప్పారంలో 97.50శాతం, జడ్పీఎస్ఎస్ నెల్లికుదురులో 96.15 శాతం, జడ్పీఎస్ఎస్ మేచరాజుపల్లిలో 95 శాతం, కేజీబీవీలో 90.91 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 10/10 జీపీఏ సాధించిన విద్యార్థులను ఎంఈవో రాము, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కే శ్రీనివాస్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.
మరిపెడ: పదో తరగతి ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తాచాటారు. మున్సిపల్ కేంద్రంలోని టీఎస్ మో డల్ పాఠశాలలో 97శాతం ఉత్తీర్ణత సాధించగా, పలువురు విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. మున్సిపల్ కేంద్రానికి చెందిన వైష్ణవి, వర్షిత, సిద్ధు అన్షిత్ 10 జీపీఏ సాధించి మండలంలో మొదటి స్థానంలో నిలిచినట్లు ప్రిన్సిపాల్ ఇలియట్ ప్రేమ్కుమార్ తెలిపారు.
నర్సింహులపేట: పది ఫలితాల్లో మండలంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. 235 మంది పరీక్షలు రాయగా 220 మంది ఉతీర్ణత సాధించారు. తెలంగాణ మోడల్స్కూల్లో జక్కుల సంధ్య 10 జీపీఏ, వైష్టవి 9.8, సుమిత్ర, నవ్వవర్షిణి, 9.7 రోహిత్, 9.5 గౌతమి, అంజలి, 9.3 వెన్నెల, 9.2 సౌందర్య, సంధ్య, అంజలిదేవి, వినత్, పర్థ వాణి, సంజ నా, అక్షయ, మళ్లీశ్వరి, 9.0 మానస, హాసిని, సంతోష్, శ్వేత, అక్షయ సాధించారు. పెద్దనాగారంలో 22 మందికి 20మంది విద్యార్థులు ఉతీర్ణత సాధించారు. 9.7 తేజశ్విని, మేగన, నర్సింహులపేట ప్రభుత్వ పాఠశాలలో 9.7 మణిదీపిక, ఆయేషా,9.2 స్నేహిత్, 9.0 శ్రావణి, భార్గవి, కస్తూర్బాలో 9.2 ఒకరు, 35 మందికి 34మంది ఉతీర్ణత సాధించారు. 9.2 ఏ శోభ సాధించారు. విద్యార్థులను ఎంఈవో రాము, పీజీ హెచ్ఎం శ్రీలత, పిన్సిపాల్ ఆనందబాబు, స్వప్న అభినందించారు.
దంతాలపల్లి: మండలంలోని విద్యార్థులు 91.11 శాత్తం ఉత్తీర్థన సాధించారు. కుమ్మరికుంట్ల, దాట్ల, పెద్దముప్పారం, రేపోణి, దంతాలపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని 225 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 205మంది పాసయ్యారు. త్రీష 9.8, దుర్గాసాయి 9.7, వైశాలి 9.7, శ్రావాణి 9.7 సాధించారు.
పెద్దవంగర: పది ఫలితాల్లో మండలంలోని ప్ర భుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యత్తమ ఫలితాలు సాధించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు 268మందికి గాను 236 మంది ఉత్తీర్ణులయ్యారు. పెద్దవంగర మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాల విద్యార్థి చింతకింది నరేంద్ర మండలంలో ప్రథమస్థానం, కేజీబీవీ పాఠశాల విద్యార్థులు ఎస్ లోకేశ్వరి, వీనక్షత్ర కొండ చరణ్చంద్, పెద్దవంగర ప్రభుత్వ ఉన్నత పాఠశాల లోఎస్ స్వప్న, ఆర్ తరుణ్, చిట్యాల ఉన్నత పాఠశాలలో ఏ శిరీష ద్వితీయ స్థానంలో నిలిచారు. విద్యార్థులను పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు.
చిన్నగూడూరు: మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కస్తూర్బా, జయ్యారం ఉన్నత పాఠశాల విద్యార్థులు పది ఫలితాల్లో ప్రతిభ చాటారు. హైస్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో 33 మంది కి 32 మంది పాసయ్యారు. సింగు కృష్ణజ, కొలిపాక అనన్య, మాలోత్ విజయ 9.5 జీపీఏ సాధించారు. కస్తూర్బాలో వందశాతం ఉత్తీర్ణులయ్యారు. బిందుమాధవి 9.7 జీపీఏ పొందారు. జయ్యారం హైస్కూల్లో 55 మందికి గాను 54 మంది విద్యార్థులు పాసయ్యారు. యుగేంధర్, భాను, నిఖిత 9.8 సాధించి పాఠశాలలో ప్రథమ స్థానంలో నిలిచారు.
తొర్రూరు: పది ఫలితాల్లో మండలంలో మొత్తం 637 మంది విద్యార్థులకు గాను 563 మంది ఉత్తీర్ణత పొందారని, 87.51శాతం నమోదైందని ఎంఈవో రాము తెలిపారు. గుర్తూరు మోడల్ స్కూల్కు చెందిన వై అభినయ్, తొర్రూరులోని సోషల్వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్కు చెందిన వీ భవానీప్రసన్న 10 జీపీఏ సాధించారు. పాఠశాలలో 78 నూరుశాతం ఉత్తీర్ణత సాధించారు. గుర్తూరు మోడల్ స్కూల్లో 94 మంది ఉత్తీర్ణులవగా, 94.95శాతం నమోదు చేసుకున్నారు. మాటేడు హైస్కూల్లో 29 మంది విద్యార్థులు పాస్కాగా 93.55శాతం, తొర్రూరు హైస్కూల్లో 136 మంది పాస్ కాగా 97.18శాతం, వెలికట్ట హైస్కూల్లో 76.47శాతం, నాంచారిమడూర్ జయంతి కాలనీ పాఠశాలలో 76.92శాతం, అమ్మాపురం హైస్కూల్లో 83.64శాతం, గుర్తూరు హైస్కూల్లో 85శాతం, కంఠాయపాలెం హైస్కూల్లో 85.37శాతం, హరిపిరాల పాఠశాలలో 83.72శాతం, చెర్లపాలెం పాఠశాలలో 88శాతం, తొర్రూరు కస్తూర్బాలో 73.53శాతం ఉత్తీర్ణత పొందారు.
కురవి: మండలంలో మొత్తం 15 పాఠశాలల్లో 712 మంది విద్యార్థులకు 646 మంది ఉత్తీర్ణత సాధించగా, 87 శాతం నమోదైనట్లు ఎంఈవో ఎంఈవో పూల్చంద్ తెలిపారు. ఏకలవ్య బాలికల గురుకులంలో 10 జీపీఏతో అజ్మీర నీరజ మండల టాపర్గా నిలిచారు. ఈ పాఠశాలలో 91 మందికి గాను 88మంది విద్యార్థులు పాసయ్యారు. హర్షిత, సింధు, దివ్య, కస్తూరి 9.8 జీపీఏ సాధించారు. సీరోలు ఏకలవ్య గురుకులంలో 80 మందికి గాను 79 ఉత్తీర్ణత సాధించగా, వీ సూర్యకుమారి 9.8తో స్కూల్ టాపర్గా నిలిచింది. నేరడ మోడల్ స్కూల్లో 92మందికి 89 మంది, నేరడ కస్తూర్బాలో 43మందికి గాను 38, కాంపల్లి పాఠశాలలో 83 మందికి గాను 75 మంది, పీ ఉష 9.8జీపీఏ, మోద్గులగూడెం పాఠశాలలో ఎస్కే హసీనా 9.8 జీపీఏ సాధించి స్కూల్ టాపర్గా నిలిచింది. మైనార్టీ గురుకులంలో 98 శాతం విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ పుష్పజారెడ్డి తెలిపారు. అర్చన, స్వప్న 9.8జీపీఏ, 9.7జీపీఏ 20మంది సాధించనట్లు తెలిపారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినులను ఉపాధ్యాయులు అభినందించారు.