భీమదేవరపల్లి, జూన్ 30 : జిల్లా వ్యాప్తంగా పదోతరగతి పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. వంగర గ్రామంలోని డాక్టర్ పీవీ రంగారావు బాలికల గురుకుల పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ సురేఖ తెలిపారు. 18 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించగా మరో 13 మంది విద్యార్థులకు 9.7 జీపీఏ సాధించారు. దీంతో ఎంపీపీ జక్కుల అనితారమేశ్, జడ్పీటీసీ వంగ రవి, సర్పంచ్ ఆలూరి రజిత, ఎంపీటీసీ నల్ల కౌసల్య, పీవీ సోదరుడి కుమారుడు పీవీ మదన్మోహన్రావు, ఎస్ఎంసీ చైర్మన్ అనపురం రమేశ్ హర్షం వ్యక్తం చేశారు.
కమలాపూర్ : మండలంలోని ఎంజేపీ బాలికల విద్యాలయంలో బండారి సాత్విక, ఏకు బిందు, స్వర్గం శృతి, అక్షయ, బాలుర విద్యాలయంలో కుండే తిరులోక్, గుంటి రాజ్కుమార్, పెరాల అరవింద్, వాసం మనోజ్, కర్నె అభిలాష, కొలిపాక రాకేశ్, కమలాపూర్ బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన వెల్ది అమృత వర్షిణి 10 జీపీఏ సాధించారు. దీంతోవారిని ఉపాధ్యాయులు అభినందించారు.
పరకాల : పదో తరగతి పలితాల్లో పరకాలకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభ చూపారు. మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల 99 శాతం ఉత్తీర్ణత సాధించగా 12మంది విద్యార్థినులు టీ వెన్నెల, బీ శ్రీనిధి, కే జ్ఞానేశ్వరి, ఎస్ కృష్ణవేణి, కే మాధురి, ఎస్ సుప్రియ, సంజన, కే హాసిని, జీ రిషిత, డీ దీప్తిశైని, బీ శ్రీతు, కే రవళి 10జీపీఏ సాధించారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాల వంద శాతం ఉత్తీర్ణత సాధించగా పావుశెట్టి అక్షిత, గుమ్ముల అశ్విని, బిట్ల నందిని 9.8జీపీఏ సాధించారు.
ఆత్మకూరు : మండలంలోని తిరుమలగిరి గ్రామంలోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ వాసవి తెలిపారు. వనం నిఖిత 9.8 జీపీఏ, రాయినేని కృష్ణవేణి 9.7జీపీఏ సాధించినట్లు తెలిపారు. ఈ మేరకు విద్యార్థులను అభినందించారు.
నడికూడ : నడికూడ జిల్లా పరిషత్ పాఠశాలలో 22మంది ఉత్తీర్ణులు కాగా పేరాల రోహిత్ 10 జీపీఏ సాధించినట్లు హెచ్ఎం పట్టాభి తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను అభినందించారు.
న్యూశాయంపేట : న్యూశాయంపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు హెచ్ఎం స్వామి తెలిపారు. వంగ సంజయ్రాజ్ 10/10, లింగబత్తుల సంతోష్ 9.8, శ్రీనిత్య, రిషక్, విజయ్ 9.5 జీపీఏ సాధించినట్లు పేర్కొన్నారు. విద్యార్థులను ఉపాధ్యాయులు, విద్యాకమిటీ చైర్మన్ అభినందించారు.
శాయంపేట : మండల పరిధిలో మొత్తం 317మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 311 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో రమాదేవి తెలిపారు. పెద్దకోడెపాక ప్ర భుత్వ పాఠశాలలో అత్యధికంగా 9.8జీపీఏ సాధించారు. అలాగే గంగిరేణిగూడెం హైస్కూల్లో 9.7, మాందారిపేట 7.8, గట్లకానిపర్తి హైస్కూల్లో 9.5, శాయంపేట బాలుర స్కూల్లో 9.2, బాలికల స్కూల్లో 9.7, కేజీబీవీలో 9.5, సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకులంలో 10, పత్తిపాకలో 9, నేరేడుపల్లి హైస్కూల్లో 9.3, కాట్రపల్లి హైస్కూల్లో 8.7 జీపీఏ సాధించినట్లు వివరించారు.
వేలేరు : తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ( టీఎస్ఆర్ఐఎస్ ) విద్యార్థి కే సంజయ్ 10 జీపీఏ సాధించి మండ ల టాపర్గా నిలిచాడు. మండల వ్యాప్తంగా విద్యార్థులు 93.4శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. వేలేరు ప్రభుత్వ పాఠశాలలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను హెచ్ఎం నాగకుమారి అభినందించారు.
ఐనవోలు మండల వ్యాప్తంగా తొమ్మిది జడ్పీ పాఠశాలు, ఓ ఎయిడెడ్, కేజీబీవీ పాఠశాలల్లో 242 మంది విద్యార్థులకు 231 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో ఒంటిమామిడిపల్లి పాఠశాలలో హరి ప్రసాద్, సన, కేజీబీవీలో శ్రీవాణి, హసని, అర్చన, నందనం పాఠశాలలో రాజేశ్ 10 జీపీఏ సాధించారు. అలాగే, ఒంటిమామిడిపల్లి, కక్కిరాలపల్లి, వెంకటాపురం, కేజీబీవీలో 100 శాతం ఉతీర్ణత సాధించినట్లు ఎంఈవో వెంకటేశ్వర్రావు తెలిపారు.