దామెర, జూన్ 30 : యువత వ్యాపార రంగంలో రాణిస్తూ ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట బిల్లా ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్ వారి డాక్టర్ ప్రైమ్సిటీ పేరుతో ఏర్పాటు చేసి కుడా లేఔట్ వెంచర్ను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గురువారం ప్రారంభించారు. వెంచర్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేకు బిల్లా ఇన్ఫ్రా కన్స్ట్రక్షన్స్ అధినేత బిల్లా రమణారెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఘనస్వాగతం పలికారు.
అనంతరం వెంచర్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వ్యాపారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన దామెర మండలం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. వెంచర్లు ఏర్పాటు చేయడం ద్వారా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ స్థిరపడే అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు. నగరానికి దామెర దగ్గరలో ఉండడం, నేషనల్ హైవే-163, రింగ్రోడ్డు, గ్రీన్ఫీల్డ్ హైవే సమీపంలో ఈ వెంచర్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
యువత వ్యాపార రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సరసమైన ధరలతో వినియోగదారులను ఆకర్షించే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పరకాల ఏసీపీ శివరామయ్య, రెడ్క్రాస్ జిల్లా చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వ వెంకటేశ్వర్రావు, సర్వోదయ యూత్ ఆర్గనేజేషన్ సెక్రటరీ పల్లెపాడు దామోదర్, ఎంపీపీ కాగితాల శంకర్, వైస్ ఎంపీపీ జాకీర్ అలీ, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు పోలం కృపాకర్ రెడ్డి, పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ బండి సారంగపాణి, మున్సిపల్ చైర్మన్ సోదా అనితారామకృష్ణ, జడ్పీటీసీలు కల్పనాకృష్ణమూర్తి, కక్కెర్ల రాజు, గూడ సుదర్శన్రెడ్డి, మొగిలి, పోలీసు ధర్మారావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గండు రామకృష్ణ, మధుసూదన్ రెడ్డి, కుడా మాజీ డైరెక్టర్ ఎన్కతాళ్ల రవీందర్, బత్తిని చిన్నరాజు, వేల్పుల ప్రసాద్ పాల్గొన్నారు.