గీసుగొండ, జూన్ 30 : ప్రతి విద్యార్థి లక్ష్యంతో చదివితే ఉద్యోగం మీ సొంతమవుతుందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని మరియపురం ఎస్ఎస్ గార్డెన్లో చల్లా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గీసుగొండ, సంగెం మండలాలకు చెందిన యువతకు 60 రోజుల పాటు ఉచిత భోజన వసతితో కూడిన శిక్షణ అందించారు. గురువారం శిక్షణ శిబిరం ముగింపు సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు వేసిందన్నారు.
కృషి, పట్టుదల ఉంటే విజయం తథ్యమన్నారు. శిక్షణ తీసుకున్న యువత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్నదన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పోలీసు ధర్మారావు, రెడ్క్రాస్ చైర్మన్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, మామునూరు ఏసీపీ నరేశ్కుమార్, సర్పంచ్లు పూండ్రు జైపాల్రెడ్డి, ప్రకాశ్, మల్లారెడ్డి, నాగేశ్వర్రావు, బాబు తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్ వరంగల్ 15,16వ డివిజన్లో 29 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే చల్లా ఆయన నివాసంలో అందించారు. ప్రజలకు ఏం కావాలో సీఎం కేసీఆర్ ముందుగానే ఆలోచించి పథకాలకు రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ప్రతిపక్షాల మాటలను నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ఆకుల మనోహర్, సుంకరి మనీషాశివకుమార్, మొగిలిచర్ల సొసైటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.